Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,70,738 కి చేరిక


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,473 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు  20,70,738కి చేరుకొన్నాయి.రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,423 కి చేరింది.

Andhra pradesh reports 222 new corona cases, total rises to 20,70,738
Author
Guntur, First Published Nov 18, 2021, 7:01 PM IST

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో31,473 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 222 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,70,738కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి  ఇద్దరు మరణించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,423 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 275 మంది Corona నుంచి కోలుకొన్నారు. Andhra pradesh రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 53వేల 755 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 2560 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 3,00,97,888 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

also read;చిత్తూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,70,286కి చేరిక

గత 24 గంటల్లో అనంతపురంలో003,చిత్తూరులో 028, తూర్పుగోదావరిలో017,గుంటూరులో038,కడపలో 010, కృష్ణాలో031, కర్నూల్ లో001, నెల్లూరులో024, ప్రకాశంలో 005,విశాఖపట్టణంలో 035,శ్రీకాకుళంలో006, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 022కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. ప్రకాశం,కృష్ణా జిల్లాల్లో కరోనాతో ఇద్దరు చనిపోయినట్టుగా ప్రభుత్వం తెలిపింది..దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,423కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,955, మరణాలు 1093
చిత్తూరు-2,47,691, మరణాలు1952
తూర్పుగోదావరి-2,94,454, మరణాలు 1290
గుంటూరు -1,78,587,మరణాలు 1247
కడప -1,15,803,మరణాలు 644
కృష్ణా -1,19,893,మరణాలు 1447
కర్నూల్ - 1,24,175,మరణాలు 854
నెల్లూరు -1,46,703,మరణాలు 1053
ప్రకాశం -1,38,645, మరణాలు 1129
శ్రీకాకుళం-1,23,304, మరణాలు 789
విశాఖపట్టణం -1,58,198, మరణాలు 1133
విజయనగరం -83,017 మరణాలు 672
పశ్చిమగోదావరి-1,79,418, మరణాలు 1120


 

Follow Us:
Download App:
  • android
  • ios