తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి…
12:06 AM (IST) May 21
IPL 2025 Final, Playoffs Venues: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ అడుగుపెట్టాయి. చివరి బెర్త్ కోసం ముంబై, ఢిల్లీ టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలను ప్రకటించింది.
11:50 PM (IST) May 20
Mumbai Indians: కీలక మ్యాచ్ లకు ముందు ముంబై ఇండియన్స్ కు పలువురు స్టార్ ప్లేయర్లు దూరం అయ్యారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ నాల్గో స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి.
11:37 PM (IST) May 20
IPL 2025 Final Venue: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ వేదికలను బీసీసీఐ ప్రకటించింది. ఫైనల్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు ముల్లన్పూర్లో జరుగుతాయి.
11:29 PM (IST) May 20
ట్రంప్, పుతిన్ చర్చల తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరామ చర్చలపై ఆశలు చిగురించాయి. పుతిన్ మంచివాడని, పరిస్థితిలో మార్పు వచ్చిందని ట్రంప్ అన్నారు.
11:21 PM (IST) May 20
IPL 2025 CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఐపీఎల్లో పాయింట్ల పట్టిక చివరి స్థానానికి పడిపోయింది.
11:03 PM (IST) May 20
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ ఖలిస్తానీ ఉగ్రవాదులు శత్రుదేశానికి వంతపాడుతున్నారు. తాజాగా ఖలిస్తాని ఉగ్రవాది ఒకరు పాక్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు.
10:51 PM (IST) May 20
Telangana: 2023–24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ పర్స్-కాపిటా జీఎస్వీఏ రూ.3.5 లక్షలకు చేరి దేశంలో అగ్రస్థానానికి చేరింది. తొమ్మిది సంవత్సరాలలో ఇది రెట్టింపు కంటే ఎక్కువ అయింది.
10:33 PM (IST) May 20
10:11 PM (IST) May 20
పహల్గాం ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ముందే తెలుసా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. నిఘా సంస్థలు ప్రధానికి హెచ్చరిక చేసినా పర్యాటకులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
10:09 PM (IST) May 20
Telangana mobile recovery: దేశంలో పోయిన మొబైల్ ఫోన్లను అత్యధికంగా తిరిగి రికవరీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. చోరీకి గురైన మొత్తం 78,114 మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేశారు.
09:20 PM (IST) May 20
Symptoms of JN.1 variant of coronavirus: జనవరి 2024లోనే భారత్లో జేఎన్.1 కోవిడ్ సబ్-వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్లో వాటి ప్రభావం పెరుగుతోంది. భారత్ లో కూడా ఈ రకం కేసులపై ప్రభుత్వం అలర్ట్ అయింది.
08:46 PM (IST) May 20
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినవారిని వదలమని, దేశం విడిచి వెళ్లినా రప్పించి వాళ్లకు సినిమా చూపిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
08:29 PM (IST) May 20
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ డ్యూయల్ సిమ్ను ఉపయోగిస్తున్నారు. దీంతో రెండు సిమ్లకు రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది.
07:59 PM (IST) May 20
TIME100 Philanthropy 2025: టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఫిలాంత్రఫీ 2025 జాబితాలో ముఖేష్, నీతా అంబానీలు రూ. 407 కోట్ల విరాళాలతో భారత టాప్ దాతలలో ఒకరిగా నిలిచారు.
07:40 PM (IST) May 20
కరోనా మహమ్మారి మరోసారి దూసుకొస్తోంది. రెండు వేవ్స్ రూపంలో వేలాది మంది ప్రాణాలను తీసుకున్న ఈ మాయదారి రోగం మళ్లీ పంజా విసురుతోంది.
07:40 PM (IST) May 20
Angry When Hungry: మనలో చాలా మంది ఆకలి వేసినప్పుడు ‘ఆకలేస్తోంది’ అని కోపంగా, చిరాకుగా చెబుతారు. అదేంటి! ఆకలేస్తే మామూలుగా చెప్పొచ్చు కదా.. కోపంగా చెప్పడం ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఓ అద్భుతమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
07:17 PM (IST) May 20
Covid-19 cases rising: ఇండియాలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. అయితే, కొత్తగా మళ్లీ కరోనా వైరస్ కేసలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణమేంటి?
06:58 PM (IST) May 20
fastest to 150 IPL wickets: హర్షల్ పటేల్ ఐపీఎల్లో కేవలం 2,381 బంతుల్లోనే 150 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసుకున్న బౌలర్ గా హర్షల్ పటేల్ రికార్డు సాధించాడు.
06:49 PM (IST) May 20
వేసవి వచ్చిందంటే తాటి ముంజలు కచ్చితంగా కనిపిస్తాయి. ఒకప్పుడు కేవలం పల్లెలకు మాత్రమే పరిమితమైన ఈ ముంజలు ప్రస్తుతం పట్టణాల్లో కూడా కనిపిస్తాయి. తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
06:24 PM (IST) May 20
Robert Kiyosaki warns of 2025 crash: రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రోబర్ట్ కియోసాకి 2025లో భారీ ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశముందని హెచ్చరించారు. నకిలీ కరెన్సీ బదులుగా రియల్ బంగారం, వెండి, బిట్కాయిన్ను దాచుకోవాలని సూచించారు.
06:07 PM (IST) May 20
దేశంలో పలు ప్రదేశాల్లో భారీ పేలుళ్లకు జరిగిన ప్రయత్నాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భగ్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ కుట్రకు సంబంధించిన విచారణను వేగవంతం చేసింది. తాజాగా ఈ కేసుతో విజయనగరం జిల్లాకు సంబంధం ఉన్నట్లు తేలింది.
05:37 PM (IST) May 20
ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఏది అనగానే గుర్తొచ్చేది సాఫ్ట్వేర్. అయితే ఇందులో నిజం ఉన్నా, ఇది ఎక్కువ కాలం కొనసాగదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..
05:34 PM (IST) May 20
Chandrababu Naidu: రైతుల సమస్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం, పంటల ధరలపై మంత్రులతో సబ్కమిటీ ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు సమక్షంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
05:06 PM (IST) May 20
Pakistan Spy Ring Exposed: ఆపరేషన్ సింధూర్ తర్వాత, జ్యోతి మల్హోత్రాతో సహా పలువురు పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎస్ఐ గూఢచర్య ముఠాను భారత్ పట్టుకోవడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
04:26 PM (IST) May 20
Indian Stock Market Explained by ChatGPT: NSE, BSE లాంటి స్టాక్ ఎక్స్ఛేంజ్ల పాత్ర, IPOల ద్వారా కంపెనీలు ఎలా మూలధనాన్ని సేకరిస్తాయి, మార్కెట్ను నియంత్రించడంలో SEBI పనితీరును AI ఎలా వివరివచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
04:22 PM (IST) May 20
Cryptocurrency: క్రిప్టోలో పెట్టుబడి పెడితే చాలా తక్కువ టైమ్ లో కోటీశ్వరులు అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు. ఇందులో నిజం కంటే రిస్కే ఎక్కువ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాపారం వెనుక రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందామా?
04:18 PM (IST) May 20
గత కొన్ని రోజులుగా కేసులు, విచారణలు, అరెస్టులు.. ఇలా ఎన్నో టెన్షన్స్తో ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం హ్యామీ మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ కవిత అంతలా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే.?
03:44 PM (IST) May 20
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఒక శుభవార్త తెలిపింది. నష్టాలను తగ్గించుకునే క్రమంలో ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యంతరాలతో అధికారులు కీల నిర్ణయం తీసుకున్నారు.
03:28 PM (IST) May 20
తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై జరిగిన హింసలో పోలీసులు కుమ్మక్కయ్యారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఎన్నికల కమిషన్, కోర్టు ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారని.. టీడీపీ, బీజేపీ, జనసేన గూండాలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
03:03 PM (IST) May 20
స్నేహం, ప్రేమ పేరిట మోసాలకు పాల్పడటం చూసాం.. కానీ పెళ్ళిపేరిట అమ్మాయిలతో హనీ ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతుందో ముఠా. ఇలా ఈ ముఠాలోని ఓ 23 ఏళ్ల యువతి 25 పెళ్లిళ్లు చేసుకుంది. ఈ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
03:01 PM (IST) May 20
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం సర్వ సాధారణమైంది. ఒకటికి మించి కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఒకటికి మంచి కార్డులు ఉపయోగిస్తే లాభమా.? నష్టమా.? ఇప్పుడు తెలుసుకుందాం.
02:51 PM (IST) May 20
Gold Price: బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇటీవల కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రతి రోజూ ఎంతోకొంత తగ్గుతూ వస్తున్నాయి. మే 20, 2025 నాటికి బంగారం ధరలు రూ.4,900 వరకు తగ్గాయి. ఇది పసిడి ప్రియులకు ఎంతో ఆనందాన్నిస్తోంది.
02:06 PM (IST) May 20
పాకిస్థాన్కు సమాచారం చేరవేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు, విదేశీ ప్రయాణాలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
01:56 PM (IST) May 20
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఉగ్రవాదులు దాడులకు కుట్రలు పన్నిన విషయం బైటపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విజయవాడను హైఅలర్ట్ చేసారు.
01:46 PM (IST) May 20
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు అధికారు.
01:44 PM (IST) May 20
Phone Use Affects: రాత్రంతా నిద్రపోకుండా ఫోన్ చూసేవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. వారి మెదడు ఊహించని సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఒక సమస్య అని కూడా వారికి తెలియదు. అవేంటి? వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
01:42 PM (IST) May 20
పిథోర్గడ్లో కొండచరియలు విరిగిపడటంతో కైలాస్ యాత్ర దారి మూసుకుపోయింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
01:28 PM (IST) May 20
హైదరాబాద్ ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా అధికారులు ఏం చెప్పారంటే..
01:22 PM (IST) May 20
ఆర్థిక ఒత్తిడి దృష్ట్యా ఖర్చులు తగ్గించాలని చైనా అధికారులకు ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నుంచి ప్రయాణాలు, మద్యం, సిగరెట్ ఖర్చులపై కత్తిరింపు ఉంటుందని ప్రకటించింది.
12:57 PM (IST) May 20
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని మూడు జాయింట్ చెక్ పోస్టుల్లో మంగళవారం నుంచి బీటింగ్ రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల భీకరంగా పోరాడిన ఇండియా, పాక్ దళాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.