- Home
- National
- TIME100 Philanthropy 2025: సంపదలోనే కాదు దాతృత్వంలో కూడా ముందే.. టైమ్100 ఫిలాంత్రఫీలో ముఖేష్-నీతా అంబానీలు
TIME100 Philanthropy 2025: సంపదలోనే కాదు దాతృత్వంలో కూడా ముందే.. టైమ్100 ఫిలాంత్రఫీలో ముఖేష్-నీతా అంబానీలు
TIME100 Philanthropy 2025: టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఫిలాంత్రఫీ 2025 జాబితాలో ముఖేష్, నీతా అంబానీలు రూ. 407 కోట్ల విరాళాలతో భారత టాప్ దాతలలో ఒకరిగా నిలిచారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టైమ్100 ఫిలాంత్రఫీ 2025 జాబితాలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు
Mukesh Ambani and Nita Ambani: ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన తొలి టైమ్100 ఫిలాంత్రఫీ 2025 జాబితాలో భారత పారిశ్రామిక దంపతులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు చోటు దక్కించుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ స్థాపక అధ్యక్షురాలు అయిన నీతా అంబానీ భారీ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలకు నిధులు అందిస్తూ వేలాది మందికి మేలు చేస్తున్నారని టైమ్ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో అంబానీలను ప్రపంచ స్థాయి మార్పు తీసుకొస్తున్న ఫిలాంత్రోపిస్టులుగా గుర్తించింది.
భారతదేశంలోనే అత్యధిక విరాళదాతలుగా అంబానీ దంపతులు
2024 సంవత్సరంలో అంబానీ దంపతులు భారతదేశంలోనే అత్యధిక విరాళదాతలుగా నిలిచారు. FY2024లో వారు దాదాపు రూ. 407 కోట్లు విరాళంగా అందించారు.
సామాజిక అభివృద్ధిలో అంబానీ దంపతులు
ముఖేష్ అంబానీ, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంతో పాటు సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తున్నారని TIME వివరించింది. స్కాలర్షిప్లు, మహిళల కెరీర్ నైపుణ్యాల అభివృద్ధి, గ్రామీణ వ్యవసాయ ప్రోత్సాహం, నీటి సంరక్షణ, ఆసుపత్రుల నిర్మాణం, పాఠశాలలు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సేవలు.. ఇలా అనేక రంగాలలో విస్తృతంగా విరాళాలు అందించారు.
రిలయన్స్ ఫౌండేషన్ తో అంబానీ సేవ కార్యక్రమాలు
నీతా అంబానీ, క్రీడాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆమె కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు యజమాన్యంలో ఉన్నారు. మహిళా క్రీడాకారులకు శాస్త్రీయ శిక్షణ, ఆధునిక సదుపాయాలు అందిస్తూ వారు మెరుగైన అవకాశాలను కల్పిస్తున్నారు. ‘‘మహిళలకు క్రీడా రంగంలో ఎదురయ్యే అడ్డంకులను దాటి వారు సాధించిన విజయం మరింత విశేషం’’ అని నీతా అంబానీ పేర్కొన్నారు.
భారతదేశంలో సామాజిక సేవా ప్రేరణగా అంబానీ దంపతులు
టైమ్100 ఫిలాంత్రఫీ జాబితాలో భారతీయులుగా ముఖేష్, నీతా అంబానీలతో పాటు, ట్రెయిల్బ్లేజర్స్ కేటగిరీలో జీరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, టైటాన్స్ కేటగిరీలో అజీమ్ ప్రేమ్జీకి కూడా స్థానం లభించింది. ఇతర అంతర్జాతీయ గౌరవప్రదులుగా డేవిడ్ బెక్హామ్, మైకెల్ బ్లూమ్బర్గ్, ఓప్రా విన్ఫ్రే, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ వంటి ప్రముఖులు ఉన్నారు. మొత్తానికి, టైమ్100 ఫిలాంత్రఫీ జాబితాలో ముఖేష్, నీతా అంబానీలకు లభించిన ఈ గౌరవం, భారతదేశంలో సామాజిక సేవా ప్రేరణగా నిలుస్తోంది.