MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad: ప్రయాణికులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ మెట్రో

Hyderabad: ప్రయాణికులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ మెట్రో

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో ఒక శుభవార్త తెలిపింది. నష్టాలను తగ్గించుకునే క్రమంలో ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యంతరాలతో అధికారులు కీల నిర్ణయం తీసుకున్నారు. 

1 Min read
Narender Vaitla
Published : May 20 2025, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం.
Image Credit : Asianet News

ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊరటనిస్తూ మంగళవారం అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. ఇటీవల టికెట్ ధరలను పెంచిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అభ్యంతరాల నేపథ్యంలో, పెరిగిన టికెట్ ధరల్లో 10 శాతం తగ్గింపు చేయాలని నిర్ణయించింది.

25
ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి రానుంది.
Image Credit : our own

ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి రానుంది.

ఈ తగ్గింపు ఈ నెల 24వ తేదీ (మే 24) నుంచి అమల్లోకి వస్తుంది. తాజా నిర్ణయం వల్ల రోజూ మెట్రోను వినియోగించే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుందని సంస్థ చెబుతోంది.

Related Articles

Related image1
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు.. 15 రోజుల్లో హాజరు కావాల‌ని ఆదేశాలు
Related image2
Rain Alert: అడుగు బ‌య‌ట పెట్టే ముందు ఆలోచించుకోండి.. వ‌చ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షాలు
35
ముందు ఎంత పెంచారంటే?
Image Credit : our own

ముందు ఎంత పెంచారంటే?

మే 17వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పెంపుతో కనిష్ఠ టికెట్ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ టికెట్ ధర రూ.60 నుంచి రూ.75కు పెరిగింది. దీంతో ప్ర‌యాణికుల‌పై క‌నిష్టం రూ. 2 నుంచి గ‌రిష్టంగా రూ. 15 వ‌ర‌కు ఆర్థిక భారం ప‌డింది.

45
కొంత‌మేర త‌గ్గ‌నున్న ధ‌ర‌లు:
Image Credit : our own

కొంత‌మేర త‌గ్గ‌నున్న ధ‌ర‌లు:

అయితే ఇప్పుడు సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ధరలపై భారం కొంతమేర తగ్గనుంది. చార్జీలు 10% తగ్గడంతో, ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే అంశంగా చెప్పొచ్చు. ప్ర‌యాణికుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

55
ప్ర‌యాణికుల‌ను పెంచే ల‌క్ష్యంగా అడుగులు
Image Credit : our own

ప్ర‌యాణికుల‌ను పెంచే ల‌క్ష్యంగా అడుగులు

ప్ర‌యాణికుల‌ను వ‌దులుకోకుండా మెట్రో మ‌రికొన్ని నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీజనల్ పాస్‌ల పై డిస్కౌంట్లు ప్రకటించాలన్న యోచనలో ఉన్న‌ట్లు స‌మాచారం. విద్యార్థులకు ప్రత్యేక కార్డులు లేదా డిస్కౌంట్స్ ప్రారంభించేందుకు కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

మొబైల్ యాప్ ద్వారా బుకింగ్‌ చేస్తే అదనపు తగ్గింపు లభించేలా కొత్త ఆఫర్లు తీసుకురావాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా ఆఫ్ పీక్ అవర్స్‌ లో ప్రత్యేక టికెట్ ధరలు వర్తింపజేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved