ప్రపంచ కప్ టోర్నీలో లీగ్ దశనుండి అదరగొట్టిన భారత్ చివరకు సెమీఫైనల్ నుండే వెనుదిరగాల్సి వచ్చింది. మాంచెస్టర్ వేదికన న్యూజిలాండ్ తో తలపడ్డ భారత్ 18పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. ఇలా భారత్ టోర్నీనుండి నిష్క్రమించినప్పటికి ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన రవీంద్ర జడేజా(77 పరుగులు), ధోని(50 పరుగులు) లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ధోనిపై ప్రశంసలు కురిపించాడు.