పంజాబ్ రాజకీయాలపై రాహుల్ గాంధీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చన్నీ, నవజోత్ సింగ్ సిద్దూల మధ్య కొనసాగుతున్న పోటీకి ఆయన ఫుల్స్టాప్ పెట్టారు. సీఎం ఫేస్గా చన్నీని ఆయన ప్రకటించారు. అయితే, ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయన ఈ సమస్యను కొలిక్కి తేవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇందులో ఆయన ప్రసంగం ఎంతో కీలకమైంది.