Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం.. పోటీ చేసేందుకు 70 మందికిపైగా అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి.
Punjab Assembly Election 2022: పంజాబ్లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి.మరోసారి అధికారం అందుకోవాలని కాంగ్రెస్, బీజేపీ లు ప్రయత్నిస్తోంటే.. ప్రజలను ఆకట్టుకునే పనిలో పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ… ఇప్పటికే పలు ఆకర్షణీయమైన హామీలను కూడా కురిపించారు.. తాజాగా.. పంజాబ్ ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్రకటించిన.. ప్రజాభీక్షం ప్రకారమే అభ్యర్థిని ఫైనల్ చేయనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
పంజాబ్ లో మహిళలకు నెలకు రూ.1000, ఉచిత కరెంటు, ఉచిత విద్యా, వైద్యం అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 10 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోను ఢిల్లీ సీఎం, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విడుదల చేశారు.
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో నెల రోజులు ఉన్న తరుణంలో ఆయన నర్మగర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కే సున్నితమైన వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించదని, పంజాబ్ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదని గత నెల ఆ పార్టీ సీనియర్ నేత వెల్లడించారు.
సోషల్ యాక్టివిస్ట్ సోనూ సూద్ సోదరి మాల్వికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్లో మోగా నియోజకవర్గంలోని తన నివాసంలోనే సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, పీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే నెల 14న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు.
Punjab Assembly Election 2022: దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాయి.. నాయకులు తమ వ్యాఖ్యల్లో పదును పెంచారు. దీంతో పంజాబ్ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.
Pupunjab election 2022: ఏడాదిలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే.. నాణ్యమైన విద్యను అందిస్తామనీ, అంబేద్కర్ కలను సాకారం చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో (5 state elections) పంజాబ్ (punjab polls 2022) కూడా ఒకటి. అత్యంత కీలకమైన ఈ రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్ (congress), పాగా వేయాలని ఆప్ (aap), బీజేపీ (bjp), శిరోమణి అకాలీదళ్ (shiromani akali dal) పావులు కదుపుతున్నాయి
Punjab Assembly Election 2022: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆదివారం ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై నిప్పులు చెరిగారు. సిద్దూకు “దిమాక్” (no brains) లేదని అన్నారు. అలాంటి “ఈ అసమర్థ వ్యక్తిని” పార్టీలో చేర్చుకోవద్దని తాను ఐదేండ్ల కిందటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సలహా ఇచ్చానని అన్నారు.