పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 24వ రోజు స్థిరంగా ఉన్నాయి. శనివారం, ఏప్రిల్ 30వ తేదీన ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారి ఏప్రిల్ 6వ తేదీన లీటర్ పెట్రోల్ పైన 80 పైసలు పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.