
Meenakshi Visit Tirumala: హడావుడి లేకుండా హాయిగా ఏడుకొండలు ఎక్కిన మీనాక్షి
ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. అలిపిరి నుంచి కాలినడకన తన భక్తి యాత్రను ప్రారంభించిన ఆమె, నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న అనంతరం, స్వామివారి దర్శనానికి ముందుకు సాగారు. నటి మీనాక్షి చౌదరి భక్తి విశ్వాసాలతో తిరుమల యాత్రను పూర్తి చేశారు.