AP Budget 2025: అప్పులపై ఇన్ని కథలా బాబు: వైఎస్ జగన్ | Asianet News Telugu
ఆంధ్రప్రదేశ్ అప్పులపై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 2023–24 కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర అప్పు రూ.4,86,151 కోట్లు కాగా, గవర్నమెంట్ గ్యారెంటీ రుణాలు మరో రూ.1.51 లక్షల కోట్లు, రెండూ కలిపి మొత్తం అప్పు రూ.6.46 లక్షల కోట్లు అని తెలిపారు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.3.13 లక్షల కోట్లు అని.. తాము దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.6.46 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ఇది వాస్తవమని... అయినా మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పు అని ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం ఎంత దుర్మార్గమని ప్రశ్నించారు. కేవలం సూపర్ సిక్స్ ఎగ్గొట్టడం కోసం, ఇలా చేయాలా అని నిలదీశారు. అలా ఎందుకు అబద్దాలు చెప్పాలి? ఎందుకంత మోసం చేయాలి? అందుకు బదులుగా ప్రజలకు క్షమాపణ చెప్పొచ్చుగా అని జగన్ పేర్కొన్నారు.