ఏపీ పేరు చెబితే అయ్యబాబోయ్‌ అంటున్న పరిశ్రమలు: అంబటి రాంబాబు | YSRCP vs TDP | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : May 16 2025, 02:47 AM
Share this Video

అంతర్జాతీయ సంస్థ వికాట్‌కి చెందిన డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీని సంబంధం లేని లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించిన కూటమి ప్రభుత్వ దుర్మార్గంను చూసి పారిశ్రామికవేత్తలు అవాక్కవుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వ్యవహారం చూశాక కంపెనీలు రాష్ట్రం పేరు చెప్తే అయ్య బాబోయ్‌ అన్న పరిస్థితిలోకి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రం ఇమేజీని ఈ రకంగా చంద్రబాబు తన కక్ష రాజకీయాలతో నాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

Related Video