Asianet News TeluguAsianet News Telugu

Karnataka Bus Accident : బాధిత కుటుంబాలకు అండగా కేసీఆర్ సర్కార్... ఆర్థికసాయం అందజేత

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన కొందరు గోవాలో భర్త్ డే పార్టీ చేసుకుని తిరిగివస్తూ కర్ణాటకలో బస్సు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన కొందరు గోవాలో భర్త్ డే పార్టీ చేసుకుని తిరిగివస్తూ కర్ణాటకలో బస్సు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ఇలా బస్ యాక్సిడెంట్ లో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. తాజాగా ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న, కలెక్టర్ శర్మన్ తదితరులు బాధిత కుటుంబాలకు అందజేసారు. మృతిచెందిన ఏడుగురి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి రూ. 50 వేల చొప్పున చెక్కులు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... కర్ణాటకలో చోటుచేసుకున్న బస్సు ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. కుటుంబాలతో కలిసి విహారయాత్రకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో జరిగిన ప్రమాదం అందరినీ కలచివేసిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు బస్సు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. ,