Asianet News TeluguAsianet News Telugu

భుజాలపైనే భార్య శవయాత్ర... మూడు కిలోమీటర్లు మోసిన భర్త

కామారెడ్డి: కరోనా మహమ్మారి మనుషులనే కాదు వారిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. 

కామారెడ్డి: కరోనా మహమ్మారి మనుషులనే కాదు వారిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. ఎక్కడ తమకు కరోనా సోకుతుందోనన్న భయంతో ఒకరికొకరు సాయం చేయడం కూడా మరిచారు. ఇలా మనుషుల్లో మానవత్వం ఏస్థాయికి అడుగంటిందో తెలియజేసే హృదయ విదారకమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందితే కరోనాతో మృతి చెందిందని భావించి ఆమె దగ్గరికి ఒక్కరు కూడా రాలేదు కదా చిన్న సహాయం కూడా చేయలేదు. దీంతో ఆ మహిళ మృతదేహాన్ని స్వయంగా ఆమె భర్త  భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరం ఉన్న స్మశానవాటిక కు తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు.