Asianet News TeluguAsianet News Telugu

వాణి జయరాం మృతిపై అనుమానాలు... పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలిందిదే...

ప్రముఖ గాయనీ వాణీ జయరాం నిన్న(శనివారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. 

ప్రముఖ గాయనీ వాణీ జయరాం నిన్న(శనివారం) ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై సినీ వర్గాలు, అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమె పోస్టుమార్టం రిపోర్టుతో ఈ అనుమానాలకు తెరపడింది. ప్రమాదం కారణంగానే ఆమె మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది. ఇంట్లోని ఓ వుడెన్ టేబుల్ తగలడంతో వాణీ జయరాం తీవ్ర రక్తస్రావమై మృతిచెందినట్లు తేల్చారు. ఈ ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేరని సిసి టివి రికార్డ్ ద్వారా తెలుస్తోంది.