Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామిపై.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడి..!

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బుధవారం అర్థరాత్రి దాడి జరిగింది. 

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బుధవారం అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళుతుంటే దాడి జరిగిందంటూ ఆర్నబ్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఘటనకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని, సోనియా గాంధీ పిరికిపంద అని అందుకే నా మీద దాడి జరిగిందని, దీనికి మీరే బాధ్యత అని ఆయన ఆరోపించారు.