Asianet News TeluguAsianet News Telugu

ఆంగ్లేయులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి, మోకాళ్ల‌పై కూర్చొబెట్టిన పాలీగార్లు..

ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీకి దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన పాలీగార్లు 18వ శతాబ్దంలో తిరుగుబాటు చేసి అతి పెద్ద స‌వాల్ విసిరారు.

ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీకి దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన పాలీగార్లు 18వ శతాబ్దంలో తిరుగుబాటు చేసి అతి పెద్ద స‌వాల్ విసిరారు. పాలేగార్లు (పాలయకారర్లు) విజయనగర సామ్రాజ్యం పాల‌న స‌మ‌యంలో ప్రాంతీయ సైనిక, రెవెన్యూ అధికారులుగా ఉండేవారు. అయితే విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యం పతనమ‌వ‌టం, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రావ‌డం వంటి పరిణామాల వ‌ల్ల ఈ ప్రాంతంలో అధికార స‌మీక‌ర‌ణల‌ను మార్చాయి. ఈస్టిండియా కంపెనీ పాలీగార్లను పేదరికంలోకి నెట్టింది. వారి నుంచే పన్నులను వసూలు చేయడం ప్రారంభించింది. దీంతో పాలీగార్ల యోధుల తెగ‌లు ఎదురుతిరిగాయి. అనేక దశాబ్దాలు ఈ ప్రాంతమంతటా పాలీగ‌ర్ లు గ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న‌ను అందించాయి. కంపెనీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి మోకాళ్ళపైకి తీసుకొచ్చాయి. కానీ కంపెనీకి బ‌లమే చివ‌రికి విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో చాలా మంది పాలీగార్ వీరులు అమరవీరులయ్యారు. వారిలో పులి తేవర్, కట్టబ్బమ్మన్, ఊమితురై, మారుత్ పాండ్యులు ఉన్నారు. ఇందులో చాలా మంది పజస్సీ రాజాతో, ట్రావెన్కోర్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు. అయితే కొంత కాలం త‌రువాత ట్రావెన్కోర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మద్దతు ఇవ్వడం మొద‌లుపెట్టారు. దీంతో పాలీగార్లు వారికి శ‌త్రువులుగా మారిపోయారు.పులి తేవ‌ర్ మదురై-తిరునల్వేలి ప్రాంతాన్ని పాలించిన మొదటి పాలీగార్ వీరులలో ఒకరు. ఆంగ్లేయులు బందిపోట్లుగా అభివ‌ర్ణించే మరావర్ల యోధ తెగలో ఆయ‌న జ‌న్మించారు. అయితే పులి ఈస్టిండియా కంపెనీతోనూ, దాని మిత్రుడైన ఆర్కాట్ నవాబుతోనూ వీరోచితంగా పోరాడారు. ఆట‌వీ మూలాలు, గెరిల్లా యుద్ధంలో నైపుణ్యం కలిగిన మరావా సైన్యం శత్రువుల‌పై మెరుపుదాడులు చేసేది. 1755లో తేవర్ సైన్యం తిరునల్వేలిలోని తన స్వస్థలమైన నెల్కాట్టుమ్‌సేవల్‌లో వద్ద కంపెనీ సైన్యాన్ని ఓడించింది. దాని నాయకుడు కల్నల్ అలెగ్జాండర్ హెరాన్ ను కూడా చంపింది. ఈ విజయం పులిని తమిళ ప్రాంతపు వీరుడుగా చేసింది. అయితే ఈ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన యూరోపియన్ శిక్షణ పొందిన ఆధునిక సైన్యాన్ని క‌ల్గి ఉన్న తిరువితంకూర్ కు చెందిన పొరుగు రాజుతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో త‌న బ‌లాన్ని మ‌రింత పెంచుకున్నారు.అయితే తిరువితంకూర్ తో తేవర్ పొత్తు కూడా ఆయ‌న అంతిమ లొంగుబాటుకు దారితీసింది. తిరువితంకూర్ వ్యూహాత్మ‌కంగా మరుతనాయగోం కార్యకలాపాల ద్వారా కంపెనీకి, ఆర్కాట్ కు మద్దతు ఇవ్వడానికి పక్షాలను మార్చాడు.  వెనుకబడిన కులానికి చెందిన మరుతానాయకం ఇస్లాం మతాన్ని స్వీకరించి యూసుఫ్ ఖాన్ అనే పేరును స్వీకరించాడు. యురేపియన్ల‌తో యుద్ధంలోనూ, వ్యూహంలోనూ శిక్షణ పొందిన ఖాన్ పులి తేవార్ కు వ్యతిరేకంగా నాయకత్వం వహించడానికి కంపెనీ ద్వారా నియ‌మితుడ‌య్యారు. మరుతనయాగోం వ్యూహాలు కంపెనీ, నవాబుల బలప్రయోగాల వ‌ల్ల మదురై అరణ్యాల నుండి పులిని ఓడించి స్వాధీనం చేసుకోవడానికి తోడ్పడ్డాయి. అనంత‌రం 1761లో కజుకుమలై వద్ద పులి తేవర్ ను ఉరితీశారు.