
Delhi Election Results: ఢిల్లీ కౌంటింగ్ కేంద్రాల్లోనే సీఎం అతీశి మకాం
Delhi Assembly Elections Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 47 స్థానాల్లో బీజేపీ, 22 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముందంజలో ఉన్నాయి. కాగా, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల్లోనే మకాం వేశారు. ఢిల్లీ సీఎం అతీశి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు.