Asianet News TeluguAsianet News Telugu

కరోనా అలర్ట్ : స్కూళ్లకు సెలవులు..అదే బాటలో సినిమా థియేటర్లు కూడా...

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లను మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లో కూడా అన్ని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. అటు ఉత్తరప్రదేశ్ లో కూడా అన్ని పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలు మార్చి 22 వరకు మూసేస్తున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.