Asianet News TeluguAsianet News Telugu

ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని అందించిన స్వతంత్ర సమరయోధుడు - హజరత్ మొహాని..!

భార‌త స్వాతంత్య్రోద్య‌మ స‌మ‌యంలో వ‌చ్చిన అనేక నినాదాలు.. పోరాటాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాయి. 

భార‌త స్వాతంత్య్రోద్య‌మ స‌మ‌యంలో వ‌చ్చిన అనేక నినాదాలు.. పోరాటాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాయి. బ్రిటిష్ గుండెల్లో గుబులును పుట్టించాయి. అలాంటి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ర‌గిల్చిన కొన్ని ప్ర‌త్యేక నినాదాల్లో ఇంక్విలాబ్ జిందాబాద్ ఒక‌టి. ఈ ప్రసిద్ధ నినాదాన్ని రూపొందించింది హస్రత్ మోహని. స్వాతంత్య్ర‌ సమరయోధుడు, కవి, కమ్యూనిస్టుగా గుర్తింపు పొందారు. ఇస్లాంలో దృఢ విశ్వాసం కలిగిన ఆయ‌న‌.. గొప్ప కృష్ణ భక్తుడు, సూఫీ అనుచరుడు కూడా.

హస్రత్ మోహాని 1875లో నేటి ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని మోహన్ గ్రామంలో జన్మించారు. ఇరాన్ నుండి వలస వచ్చిన ఆయ‌న తల్లిదండ్రులు అతనికి సయ్యద్ ఫజల్ ఉల్ హసన్ అని పేరు పెట్టారు, హస్రత్ మోహాని అతని కలం పేరు. బ్రిటీష్ అనుకూల మొహమ్మదేన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలలో చదువుతున్నప్పుడు బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల నేప‌థ్యంలో ఆయ‌న బహిష్కరించబడ్డాడు. 1903లో అరెస్టయిన మోహాని మరుసటి సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1921 నాటి కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ సెషన్‌లో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం డిమాండ్‌ను లేవనెత్తిన మొదటి వ్యక్తులు హజ్రత్ మోహాని, స్వామి కుమారానంద్. 1925లో కాన్పూర్‌లో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ మొదటి సమావేశానికి ఆయన ముఖ్య నిర్వాహకుడయ్యారు. కమ్యూనిస్ట్ ఉద్యమం వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్నారు. తరువాత ఆయ‌న ఆజాద్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించాడు. 

త‌ర్వాత ముస్లిం లీగ్‌లో కూడా చేరాడు. తరువాత పాకిస్తాన్, విభజన డిమాండ్‌పై మోహని జిన్నా లీగ్ నుండి వైదొలిగారు. అతను పాకిస్తాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించాడు. విభజన తర్వాత భారతదేశంలోనే ఉన్నాడు. మత సామరస్యాన్ని నమ్మిన మోహాని రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. మోహని కృష్ణాష్టమికి మధురై, హజ్ సమయంలో మక్కాకు తీర్థయాత్రలు చేసేవారు. అనేక ఉర్దూ పద్యాలు, గజల్స్ ర‌చించారు.