)
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులను తరిమికొట్టాలనే పోరాటం - 1917 హిందూ జర్మన్ కాన్స్పిరసీ
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చోటుచేసుకున్న అనేక సంఘటనలు... భారత జాతి స్వేచ్ఛా సంకేళ్లను తెంచడానికి ప్రయత్నించాయి.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చోటుచేసుకున్న అనేక సంఘటనలు... భారత జాతి స్వేచ్ఛా సంకేళ్లను తెంచడానికి ప్రయత్నించాయి. అయితే, ఇందులో పెద్దగా వెలుగులోకి రాని ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటికోవలోకి చెందినదే నాటి హిందూ-జర్మన్ కుట్ర కేసు.. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పెద్దగా తెలియని ఈ ఘటన 1917 లో అమెరికాలో చోటుచేసుకుంది.
అమెరికాలో ఏర్పాటైన హిందుస్థాన్ గద్దర్ పార్టీ, ప్రవాస భారతీయ జాతీయవాదులు ఏర్పాటు చేసిన జర్మనీకి చెందిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఈ కుట్ర వెనుక ఉన్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటం, బ్రిటన్ వైఖరిని ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి భారత్, యూఎస్ఏ సహా పలు యూరోపియన్ నగరాలలో ఏకకాలంలో వరుస పేలుళ్లను జరపాలని ప్రణాళిక రచించాయి. దీనికి జర్మనీ, జపాన్, చైనా, టర్కీ, రష్యన్ బోల్షివిక్కులు, ఐరిష్ విప్లవకారులు సహా బ్రిటిష్ వ్యతిరేక ప్రభుత్వాల మద్దతు లభించింది. జర్మన్లు ఏర్పాటు చేసిన డబ్బు, ఆయుధాలు భారత్కు రవాణా చేయబడ్డాయి. కానీ బ్రిటిష్-అమెరికన్ ఇంటెలిజెన్స్ ఈ పథకం గురించి తెలుసుకుని, ఓడను అడ్డగించి, చంద్రకాంత్ చక్రవర్తి, పండిట్ రామ్ చంద్ర, రామ్ సింగ్ వంటి గద్దర్ నాయకులతో సహా అనేక మంది నిర్వాహకులను అరెస్టు చేసింది. యూఎస్ఏకు చెందిన అనేక మంది జర్మన్ దౌత్య అధికారులను అరెస్టు చేసింది.
1917లో శాన్ ఫ్రాన్సిస్కోలో జర్మన్లు, హిందువులుగా పిలువబడే భారతీయులతో సహా 100 మందికి పైగా వ్యక్తులపై విచారణ ప్రారంభమైంది. విచారణ చివరి రోజు కోర్టు లోపల నాటకీయ సంఘటనలు జరిగాయి. గద్దర్ పార్టీ అధ్యక్షుడు పండిట్ రామ్ చంద్ర భరద్వాజ్ ను రామ్ సింగ్ అనే గద్దర్ నాయకుడు కాల్చి చంపాడు. కోర్టులో ఉన్న యుఎస్ పోలీసు అధికారి వెంటనే సింగ్ ను కాల్చి చంపాడు. నిందితుల్లో చాలా మందికి కోర్టు శిక్ష విధించింది. అయితే, రాడికల్స్ పట్ల అమెరికన్ ప్రజల సానుభూతిని అనుసరించి, దోషులందరినీ అప్పగించాలని బ్రిటన్ చేసిన అభ్యర్థనను అమెరికా తిరస్కరించింది.