Asianet News TeluguAsianet News Telugu

స్పీడ్ పెంచుతున్న మహేష్..ఇక అభిమానులకి పండగే....

మహేష్‌ హీరోగా `అర్జున్‌రెడ్డి` దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఓ సినిమా చేయాల్సింది. 

మహేష్‌ హీరోగా `అర్జున్‌రెడ్డి` దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఓ సినిమా చేయాల్సింది. వీరి కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించిన  చర్చలు చాలా జరిగాయి. దాదాపు కన్ఫమ్‌ అనే వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా వర్కౌట్‌ కాలేదు. దీంతో సందీప్‌ హిందీలో `అర్జున్‌రెడ్డి` రీమేక్‌ `కబీర్‌ సింగ్‌` తీసి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు.