భూకబ్జా... ఇక ఆత్మహత్యే శరణ్యం: టవర్ ఎక్కి యువకుడి నిరసన
Jan 4, 2021, 3:07 PM IST
తమ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకోవడమే కాదు తమను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ గుంటూరు జిల్లా కాకుమానికి చెందిన నల్లమోతు వెంకట శ్యాం ఆందోళనకు దిగాడు. అధికారులు జోక్యం చేసుకుని తన న్యాయం చేయాలంటూ సెల్ ఫోన్ గవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చేవరకు టవర్ పైనుండి దిగేది లేదని స్నష్టం చేశాడు.