Asianet News TeluguAsianet News Telugu

వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... సీఎం జగన్ చేతులమీదుగా...

అమరావతి: ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సేవలను ఇంటి గడప వద్దకే చేరుస్తున్న వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా సత్కారాలు అందుకుంటున్నారు. 

అమరావతి: ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సేవలను ఇంటి గడప వద్దకే చేరుస్తున్న వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా సత్కారాలు అందుకుంటున్నారు. ప్రజాసేవ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగ సందర్భంగా సత్కారం, అవార్డులు అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రదానం చేశారు.