Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల బృందంతో అసెంబ్లీకి చంద్రబాబు... ఓటేసిన టిడిపి సభ్యులు

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నానికే దాదాపు పూర్తయ్యింది. 

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నానికే దాదాపు పూర్తయ్యింది. నెల్లిమర్ల  ఎమ్మెల్యే  అప్పలనాయుడు మినహా ఎమ్మెల్యేలంతా ఓటేసారు. ఉండవల్లిలోని పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు నివాసం నుండి టిడిపి ఎమ్మెల్యేలంతా ఓ బృందంగా బయలుదేరారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో పాటు టిడిపి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందే ముఖ్యమంత్రి జగన్ తో పాటు వైసిపి ఎమ్మెల్యేలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.