Asianet News TeluguAsianet News Telugu

ఏసిబి వలలో మహిళా అసిస్టెంట్ రిజిస్ట్రార్... నోట్ల కట్టలే కట్టలు..!

కర్నూల్ : భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మహిళా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసిబి దాడులు చేసింది.

కర్నూల్ : భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మహిళా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసిబి దాడులు చేసింది. కర్నూల్ లోని  అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజాత ఇంటితో పాటు కార్యాలయంలో, బంధువుల ఇళ్లలోనూ అవినితి నిరోదక శాఖ అధికారుల బృందాలు ఏకకాలంలో దాడులకు దిగాయి. ఈ సోదాల్లో భారీగా డబ్బులతో పాటు బంగారం, ఆస్తి పత్రాలు లభించినట్లు సమాచారం.