పాకిస్థాన్ లో రైలు హైజాక్ సంఘటనతో ప్రపంచం నివ్వెరపోయింది. రైలులో బందీ అయిన ప్రయాణికుల యోగక్షేమాలపై మూడు రోజులుగా తీవ్ర ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు ఈ పరిణామాలకు సుఖాంతం పడింది. భద్రతా బలగాలు తీవ్రవాదులను మట్టుబెట్టి, ప్రయాణికులను రక్షించాయి.