Ship Hijack: ఆ షిప్ పై భారతీయులంతా సేఫ్.. రక్షించిన ఇండియన్ నేవీ
గురువారం సాయంత్రం హైజాక్ అయిన షిప్పై ఉన్న భారతీయలు, ఇతర ప్రయాణికులను ఇండియన్ నేవీ కాపాడింది. వారందరూ సురక్షితంగా ఉన్నారని, ఆ షిప్ పై పైరేట్లు ఎవరూ లేరని అధికారులు వెల్లడించారు.
![indian navy rescues hijacked ship and aboard indiansn, other passengers and crew kms indian navy rescues hijacked ship and aboard indiansn, other passengers and crew kms](https://static-ai.asianetnews.com/images/01hkd1p7j42hrbyakmf59cd45x/j_363x203xt.jpg)
Ship Hijack: నిన్న సాయంత్రం అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన కార్గో షిప్ను ఇండియన్ నేవీ ట్రేస్ చేసింది. ఆ షిప్ పై ఉన్న 15 మంది భారతీయులు సహా మొత్తం 21 ప్రయాణికులు, సిబ్బందిని కాపాడింది. వారంతా సేఫ్గా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆ షిప్ పై హాజకర్లు ఎవరూ లేరని పేర్కొంది.
గురువారం సాయంత్రం ఎంవీ లీలా నార్ఫోక్ కార్గో షిప్ హైజాక్కు గురైంది. సోమాలియా తీరంలో ఈ ఘటన జరిగింది. దీన్ని యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గుర్తించింది. వ్యూహాత్మక జలాల్లో నావల కదలికలను ట్రాక్ చేసే ఈ మేరిటైమ్ ఎంవీ లీలా నార్ఫోక్ కార్గో షిప్ హైజాక్ అయినట్టు వెల్లడించింది. దీంతో ఇండియన్ నేవీ అలర్ట్ అయింది. ఎలైట్ కమాండోస్ మార్కోస్ రంగంలోకి దిగింది.
నేవీ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై నావల్ వార్షిప్.. పహారా బాధ్యతల నుంచి వీరిని కాపాడటానికి బయల్దేరింది. ఈ ఐఎన్ఎస్ చెన్నై హెలికాప్టర్ను పంపింది. హైజాక్ చేసిన పడవల నుంచి పైరేట్లు వెంటనే పారిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత వారిని చేరుకుని కాపాడింది.