Pok gangrape victim: పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన గ్యాంగ్ రేప్ బాధితురాలు ప్రధాని మోదీని ఆశ్రయించింది. గత ఏడేండ్లుగా.. న్యాయం కోసం పోరాడుతున్న తనకు న్యాయం జరగలేదనీ, న్యాయం చేయడంలో అక్కడి పోలీసులు, స్థానిక రాజకీయ నాయకులు విఫలమయ్యారని ఆరోపించింది. ప్రధాని మోదీని ఉద్దేశించి మారియా తాహిర్ మాట్లాడినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.