Delhi gangrape: కారులో 16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు, నేరం జరిగిన సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి సహా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi Girl Gang-Raped In Car: దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వారిపై దాడులు, అఘాయిత్యాలు నిత్యం చోటుచేసుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కారులో ఒక మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసుకునీ, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... కదులుతున్న కారులో 16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు, నేరం జరిగిన సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి సహా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురూ 23, 25, 35 ఏళ్ల వయస్సు గలవారేనని IANS నివేదించింది. జూలై 7 మధ్య రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తనకు గతంలో తెలిసిన ఇద్దరు వ్యక్తులను కలవడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. నిందితులపై సెక్షన్లు 323 (దాడి), 342 (తప్పుగా నిర్బంధించడం), 354 (వేధింపు), 376 డి (గ్యాంగ్రేప్), 377 (అసహజ నేరం), 363 (మైనర్ని కిడ్నాప్ చేయడం), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్షన్లతో పాటు POCSCO చట్టం కింద కేసు నమోదుచేశారు.
16 ఏళ్ల బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినందుకు ముగ్గురు వ్యక్తులను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు ఆమె స్నేహితుడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, జూలై 7న బాలిక అతనితో పాటు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి రైడ్కి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లుగా ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను మహ్మద్ ఆరిఫ్ (23), మనోజ్ కుమార్ (25), రూపేష్ కుమార్ (35)గా పోలీసులు గుర్తించారు.
జూలై 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తమ కుమార్తెను ముగ్గురు వ్యక్తులు వేధించారని బాలిక తండ్రి నుంచి తమకు ఆసుపత్రి నుంచి కాల్ వచ్చిందని డీసీపీ మనోజ్ తెలిపారు. “జూలై 6వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన కూతురు ముగ్గురు వ్యక్తులతో కలిసి కారులో విహారయాత్రకు వెళ్లిందని బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. వారు జూలై 7న ఉదయం 7 గంటలకు తిరిగి వచ్చారు. ఆమె తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. “అమ్మాయిని అర్థరాత్రి ఆసుపత్రికి తీసుకువెళ్లారు.. కౌన్సెలర్ ద్వారా పరీక్షించినప్పుడు, జూలై 6న తనను కలిసిన ఇద్దరు తెలిసిన వ్యక్తులు తమ వ్యాగన్ఆర్ కారులో ఆమెకు జాయ్రైడ్ను అందించారని ఆమె వెల్లడించింది. వారు మద్యం కొనుగోలు చేసి బాలికతో బలవంతంగా తాగించారు. ఆ తర్వాత వారు బాలికతో కలిసి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లి అక్కడ ఇద్దరు వ్యక్తులు కారులో ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.