Pok gangrape victim: పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన గ్యాంగ్ రేప్ బాధితురాలు ప్రధాని మోదీని ఆశ్రయించింది. గత ఏడేండ్లుగా.. న్యాయం కోసం పోరాడుతున్న తనకు న్యాయం జరగలేదనీ, న్యాయం చేయడంలో అక్కడి పోలీసులు, స్థానిక రాజకీయ నాయకులు విఫలమయ్యారని ఆరోపించింది. ప్రధాని మోదీని ఉద్దేశించి మారియా తాహిర్ మాట్లాడినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Pok gangrape victim: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో గ్యాంగ్రేప్ గురైన ఓ బాధితురాలు.. తాను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నననీ, సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. తనకు, తన పిల్లలకు ఆశ్రయం, రక్షణ కల్పించాలని ప్రధాని మోడీకి భావోద్వేగ విజ్ఞప్తి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి చెందిన మరియా తాహిర్ అనే గ్యాంగ్ రేప్ బాధితురాలు. గత ఏడేళ్లుగా తనకు న్యాయం చేయడంలో కోర్టులు, పోలీసులు, ప్రభుత్వం విఫలమయ్యాయని బాధితురాలు వీడియో సందేశంలో పేర్కొంది. తనను భారతదేశానికి రావడానికి అనుమతించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ, రాజకీయ నాయకుడు చౌదరి తారిఖ్ ఫరూఖ్, పోలీసులు తనను, తన పిల్లలను చంపేసే అవకాశం ఉందని మారియా పేర్కొంది.
ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. నేను గత ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న గ్యాంగ్ రేప్ బాధితురాలిని. నాకు న్యాయం చేయడంలో PoK పోలీసులు, ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ విఫలమయ్యాయి" అని ఆమె అన్నారు. "ఈ వీడియో ద్వారా.. మమ్మల్ని భారతదేశానికి రావడానికి అనుమతించమని భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పిల్లలకు ప్రాణహాని ఉంది. స్థానిక పోలీసులు, సీనియర్ రాజకీయ నాయకుడు చౌదరి తారిక్ ఫరూఖ్ ఎప్పుడైనా నన్నునా పిల్లలను చంపేస్తారు. ఆశ్రయం, రక్షణ కల్పించాలని నేను ప్రధాని మోదీని అభ్యర్థించాలనుకుంటున్నాను అని ప్రధానికి తన భావోద్వేగ వీడియో సందేశంలో తెలిపారు.
తనపై 2015లో జరిగిన ఘోరమైన నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని.. తనపై జరిగిన ఘటనను వివరించింది. హరూన్ రషీద్, మమూన్ రషీద్, జమీల్ షఫీ, వకాస్ అష్రఫ్, సనమ్ హరూన్ మరో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె అన్నారు.ఈ దారుణంపై.. పోలీసులను, స్థానిక రాజకీయ నాయకులను ఆశ్రయించినా న్యాయం జరగలేదనీ, ప్రధాన న్యాయమూర్తితో సహా స్థానిక అధికారులకు అనేక లేఖలు రాసింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని అనేక మంది అత్యాచార బాధితులు మరియు వారి కుటుంబాలు నేరస్థులను బహిరంగంగా ఎదుర్కోవడానికి భయపడుతున్నారు, ఎందుకంటే వారు తమ సంఘం నుండి దూరంగా ఉంటారని భయపడుతున్నారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)ని తిరిగి పొందడం ప్రభుత్వ ఎజెండాలో తదుపరిది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల అన్నారు.