Asianet News TeluguAsianet News Telugu

మోర్తాడ్ విఆర్ఓ పై వేటేయండి : తెలంగాణ మంత్రి పోచారం

నిజామాబాద్ హాట్ న్యూస్..

Pocharam expresses anguish at Morthad VRO

నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. జిల్లోలని బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని  వేల్పూర్ మండలం రామన్నపేట, మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన  “భూరికార్డుల పరిశీలన” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి, మిషన్ భగీరధ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యం. రామ్మోహన్ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోర్తాడ్ రైతులు స్థానిక విఆర్ఓ మీద ఫిర్యాదు చేశారు. ఆయన రైతులకు సరైన సేవలు అందించడంలేదని, మోర్తాడ్ విఆర్ఓ మీద యాక్షన్ తీసుకోవాలని రైతులు కోరారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పోచారం తక్షణమే మోర్తాడ్ విఆర్ఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికైనా అధికారులు తప్పులను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ సూచనలను అమలు చేయల్సిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు పోచారం. సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడదని హెచ్చరించారు.

ఆయా గ్రామాల్లో పోచారం మాట్లాడారు. ఆయన మాటలు కింద చదవండి.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో ముఖాముఖి మాట్లాడి భూముల సమస్యలను పరిష్కరించాలి. కోర్టు కేసులు, వివాదాలలో ఉన్న భూములను పక్కన పెట్టాలి. ముఖ్యంగా వారసత్వ భూముల (పౌతి పట్టా) విషయంలో ఆలస్యం చేయకూడదు. వివాదరహిత భూములను కూడా వెంటనే నమోదు చేసి రైతులకు పాస్ పుస్తకాలను జారి చేయాలి. నూతనంగా కొనుగోలు చేసిన భూములకు పాస్ పుస్తకాలు అందించాలి. జూన్ 20 నాటికి రికార్డుల ప్రక్షాళనను పూర్తి చేసి పాస్ పుస్తకాలను ప్రతి రైతుకు అందజేస్తాం. రైతుల కష్టాలను తొలగించడానికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం . క్రింది స్థాయిలోని అధికారుల తప్పదం, నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.

రైతులకు అన్యాయం జరిగితే సహించేదిలేదు. అధికారులపై చర్యలకు వెనుకాడం. తొలకరి వర్షాలు కురవగానే రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఎవరి దగ్గర అప్పు కోసం చేయి చాచకుండా ప్రభుత్వమే పెట్టుబడి సమకూర్చడం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమే పంట పెట్టుబడిగా ఎకరాకు రూ. 8000 ను రైతుబంధు పథకం ద్వారా అందిస్తుంది. రైతుబంధు పథకం సమర్ధవంతంగా అమలుకు పాస్ పుస్తకాలే ప్రామాణికం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకున్నారు.  100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. అయితే కొంతమంది కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో కొన్ని గ్రామాలలో భూముల నమోదులో తప్పులు దొర్లాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios