నల్గొండ జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
నల్గొండ జిల్లాలో ఎమ్మార్పీ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
నల్గొండ: ఉమ్మడి నల్గోండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల వద్ద ఎలిమినేటి మాధవ రెడ్డి కాలువలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బాలుడిని స్థానికులు కాపాడారు.
Also read:కరీంనగర్లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలో ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రంగయ్య, అలివేలు, కీర్తి మృతి చెందారు. ఓ బాలుడిని స్థానికులు రక్షించారు.
Also read:రాధిక కుటుంబం జల సమాధి: సీసీ కెమెరాల్లో కారు గుర్తింపు
పెద్దఅడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రంగయ్య, అలివేలు, కీర్తి మరో బాలుడు ts 07 ug 4494 అనే నెంబర్ కారులో ఓ పెళ్లికి ఇవాళ ఉదయం హాజరయ్యారు.
పెళ్లి నుండి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. . కారు ముందు టైరు పేలడంతో ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా స్థానికులు చెప్పారు. కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారు కాలువలో దూసుకెళ్లడాన్ని చూసిన స్థానికులు వెంటనే కారులో ఉన్న ఓ బాలుడిని రక్షించారు.
ఇటీవల కాలంలో కాలువల్లో కార్లు బోల్తా పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ మాసంలోనే రెండు ఘటనలు వెలుగు చూశాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబం గత నెల 27వ తేదీన కాకతీయ కాలువలో పడి మృతి చెందారు.
ఈ నెల 16వ తేదీన తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ఒక్కరు మృతి చెందారు.తాజాగా ఇవాళ నల్గొండ జిల్లాలో మరో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.