తెలుగుదేశం పార్టీ విజయవాడ నేత వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Andhra Pradesh Jan 12, 2022, 8:28 AM IST
తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా (Vangaveeti Radha) వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారానికి సంబంధించి మంత్రి కొడాలి నాని (Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగిదే చంద్రబాబుకే అంటూ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Jan 4, 2022, 5:21 PM IST
వంగవీటి రాధ హత్యకు రెక్కీ జరగడంపై సిబిఐతో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేసారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతానని నాని తెలిపారు.
Andhra Pradesh Jan 3, 2022, 6:02 PM IST
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై విచారణ జరిపామన్నారు విజయవాడ పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా. రాధాపై రెక్కీ జరిగినట్లు ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. రాధాకు గన్మెన్లను కేటాయించామని సీపీ వెల్లడించారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారని క్రాంతి రాణా మండిపడ్డారు.
Andhra Pradesh Jan 2, 2022, 8:45 PM IST
రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు చెప్పినట్టు చేయవద్దని వంగవీటి రాధాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హితవు పలికారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారన్నారు.
Andhra Pradesh Jan 2, 2022, 12:03 PM IST
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) ఇంటికి టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వెళ్లారు. ఈ సందర్భంగా రెక్కీ చేశారన్న అంశంపై రాధా, ఆయన తల్లి వంగవీటి రత్నకుమారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.
Andhra Pradesh Jan 1, 2022, 6:52 PM IST
కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్యను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగయితే స్వార్థరాజకీయాలకు వాడుకున్నాడో అలాగే వంగవీటి రాధ హత్యను వాడుకోవాలని వైఎస్ జగన్ కుట్రలు పన్నుతున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Andhra Pradesh Dec 31, 2021, 5:01 PM IST
ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేసి శాంతిభద్రతలకు ఇబ్బంది కల్గిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని విజయవాడ సీపీ హెచ్చరించారు.
Andhra Pradesh Dec 31, 2021, 1:29 PM IST
వంగవీటి రాధాపై (vangaveeti radha krishna) రెక్కీ జరిగి పదిరోజులౌతున్నా చర్యలు శూన్యమన్నారు టీడీపీ (tdp) పొలిట్ బ్యూరో సభ్యులు , మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు. వంగవీటి రాధా వైసీపీని (ysrcp) వీడినందుకు ఆయనపై ఆ పార్టీ నాయకులు కక్షకట్టి రెక్కి నిర్వహించారని ఆరోపించారు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని చూపిస్తూ నాటకమాడుతున్నారని వెంకట్రావు ఎద్దేవా చేశారు.
Andhra Pradesh Dec 30, 2021, 7:28 PM IST
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వంగవీటి రాధా (Vangaveeti Radha) కామెంట్స్ గురించి తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసింది. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ రాధ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన ఆఫీస్ వద్ద అనుమానస్పదంగా స్కూటీ పార్క్ చేసి ఉండటం కలకలం రేపింది.
Andhra Pradesh Dec 30, 2021, 3:21 PM IST
టిడిపి నాయకుడు వంగవీటి రాధ తనకు ప్రాణహాని వుందంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తాజాగా జనసేన పార్టీ నాయకుడు పోతిన మహేష్ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు.
Andhra Pradesh Dec 30, 2021, 2:45 PM IST
వంగవీటి రాధాకృష్ణ (vangaveeti radha krishna) చుట్టూ బెజవాడ రాజకీయం తిరుగుతోంది. తన హత్యకు కుట్ర చేశారన్న రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రభుత్వం 2+2 గన్మెన్లను కేటాయించినా ఆయన వెనక్కి తిప్పిపంపారు. అయితే గన్మెన్లను తీసుకోవాలా వద్దా అన్నది రాధా వ్యక్తిగత విషయమని ఏపీ మంత్రులు చెబుతున్నారు
Andhra Pradesh Dec 29, 2021, 6:19 PM IST
ప్రాణహాని ఎదుర్కుంటున్న విజయవాడ నేత వంగవీటి రాధాకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రెక్కీ ఘటనపై ఆయన ఆరా తీశారు. భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Andhra Pradesh Dec 29, 2021, 8:43 AM IST
మా ఇంటి దగ్గర ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గమనించి నిన్న సరాసరి ఆసుపత్రికి తీసుకువచ్చారు. బ్లడ్ ప్రెజర్ ఎక్కువ కావడంతో వచ్చి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూ లో ఉన్నారు. నెహ్రూ స్పూర్తితో మా నాన్న పైకి వచ్చారు. ఆయన వెనక ఎవ్వరూ లేరు. స్వయంగా ఎదిగారు.
Andhra Pradesh Dec 29, 2021, 7:37 AM IST
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇంటి వద్ద రెక్కీ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బెజవాడకు చెందని కొందరు అనుమానితులపై పోలీసులు దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా కార్పోరేటర్ అరవ సత్యంను పోలీసులు ప్రశ్నించారు.
Andhra Pradesh Dec 28, 2021, 8:25 PM IST