రేవ్ పార్టీలో జనసేన స్టార్ క్యాంపైనర్... ఇదిగో క్లారిటీ!
జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ జానీ మాస్టర్ బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఈ క్రమంలో జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడు.
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో విస్తృతంగా పర్యటించారు. భారీగా క్యాంపైన్ నిర్వహించాడు. పిఠాపురంతో పాటు జనసేన అభ్యర్థులు నిల్చున్న నియోజక వర్గాల్లో జానీ మాస్టర్ గాజు గ్లాస్ కు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఇదిలా ఉండగా మే 18 ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఓ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు దాడి చేశారు.
కొందరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. టాలీవుడ్ నుండి నటి హేమ, శ్రీకాంత్, జానీ మాస్టర్ పేర్లు వినిపించాయి. హేమ ఓ వీడియో బైట్ విడుదల చేసింది. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఓ ఫార్మ్ హౌస్ లో చిల్ అవుతున్నాను.నేను బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. అయితే బెంగుళూరు పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫోటో, వీడియో బైట్ లో ధరించిన డ్రెస్ సేమ్. బెంగుళూరులోనే ఉన్న హేమ అదే ఫార్మ్ హౌస్ లో పక్కకు వెళ్లి వీడియో చేసిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీకాంత్ కూడా వివరణ ఇచ్చారు. ఇప్పుడు నేను నా ఇంటి వద్ద నుండే ఈ వీడియో చేస్తున్నాను. నాకు పార్టీలకు వెళ్లే అలవాటు లేదు. అసలు రేవ్ పార్టీలు అంటే ఏమిటో తెలియదు అన్నాడు. కాగా రేవ్ పార్టీలో అరెస్ట్ కాబడిన ఓ వ్యక్తి జానీ మాస్టర్ అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో జానీ మాస్టర్ స్పందించారు.
''నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని.అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం.ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితి పై జాలేస్తుంది'' అని జానీ మాస్టర్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు.