వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila).. మంత్రి కేటీఆర్కు (Teenmar Mallanna) మద్దతుగా నిలిచారు. అయితే ఇది రాజకీయ పరమైన విషయంలో మాత్రం కాదు.కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించాల్సిందేనని వైఎస్ షర్మిల అన్నారు.
Telangana Dec 25, 2021, 10:28 AM IST
క్యూన్యూస్ మీడియా ట్విట్టర్లో నిర్వహించిన ఓ పోల్ తీవ్ర పరిణామాలకు బీజంగా మారింది. కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్తో చేసిన ఆ పోల్ కారణంగా తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం పెల్లుబికింది. ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ తీన్మార్ మల్లన్న, బీజేపీపై నిప్పులు చెరిగారు. తాజాగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు.
Telangana Dec 25, 2021, 12:21 AM IST
బీజేపీ నేతలపై (bjp) మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr). తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
Telangana Dec 24, 2021, 10:30 PM IST
తీన్మార్ మల్లన్నగా చెప్పుకునే జర్నలిస్టు చింతపండు నవీన్ ఎప్పుడూ బీజేపీ కోసమే పని చేశాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చింతపండు నవీన్ యాంకర్ మాత్రమే అని జర్నలిస్టు కాడని ధ్వజమెత్తారు.
Telangana Dec 8, 2021, 6:42 PM IST
ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) మంగళవారం బీజేపీలో (BJP) చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్న కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Telangana Dec 7, 2021, 1:25 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
Telangana Dec 6, 2021, 5:01 PM IST
Teenmaar Mallanna: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో అసలు ప్రతి పక్షమే లేదనుకున్న సీఎం కేసీఆర్ కు ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ లు తలనొప్పిగా మారాయి. ఇందులో బీజేపీ స్పీడ్ చూస్తుంటే.. కేసీఆర్ కు వణుకుపుడుతున్నట్లు అనిపిస్తోంది. హుజురాబాద్ ఎన్నికల తరువాత.. బీజేపీ మరింత జోరు పెంచింది. పార్టీలో కీలక నాయకులను చేర్చుకుంటూ బలోపేతం చేయాలని భావిస్తోంది.
Telangana Dec 6, 2021, 10:27 AM IST
హుజురాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అభినందించారు. ఈ రోజు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటలకు కీలక పదవి ఇచ్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Telangana Nov 9, 2021, 4:44 PM IST
బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి.
Telangana Nov 8, 2021, 10:15 PM IST
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై సుమారు 35 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ విచారించి హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.
Telangana Nov 8, 2021, 1:28 PM IST
తీన్మార్ మల్లన్నకు గట్టి షాక్ తగిలింది. ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నట్టు ప్రకటించిన తర్వాత మల్లన్న టీం సభ్యులు టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరారు. మల్లన్న కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ దాసరి భూమయ్య, మరో వంద మంది టీఆర్ఎస్లోకి చేరగా, హుజురాబాద్ మల్లన్న కమిటీ సభ్యులు సుమారు 300 మంది గులాబీ కండువా కప్పుకున్నారు.
Telangana Oct 3, 2021, 8:19 PM IST
ప్రస్తుతం జైల్లో వున్న తీన్మార్ మల్లన్నకు మరో షాక్ తగిలింది. ఆయనకు సన్నిహితుడు, రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
Telangana Oct 3, 2021, 11:50 AM IST
క్యూన్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు వచ్చిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పనున్నాయి. మల్లన్న బీజేపీలో చేరనున్నారని ఆయన సతీమణ ిమమత ప్రకటించినట్టు సమాచారం వచ్చింది. అదే నిజమైతే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి ఆయన మరో అస్త్రంగా మారనున్నారు. టీఆర్ఎస్పై ఆయన ఆరోపణలు, తీవ్ర విమర్శల వెనుక బీజేపీ మద్దతు ఉన్నదనేది కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే అటు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి బీజేపీలో చేరడమే సముచితమని మల్లన్న భావించి ఉండవచ్చనేది విశ్లేషకుల మాట.
Telangana Sep 30, 2021, 8:13 PM IST
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న భార్య మమత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మల్లన్నను విడుదల చేయించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆమె మెయిల్ చేశారు.
Telangana Sep 30, 2021, 7:49 PM IST
గతంలో అరెస్టైన కేసులో బెయిల్ పై విడుదల అవుతారని మల్లన్న అనుచరులు భావించారు. కానీ మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన జైలు నుండి విడుదల కావడం కష్టంగా మారింది.
Telangana Sep 24, 2021, 12:43 PM IST