పెగాసస్ సాఫ్ట్ వేర్ ఆరోపణలపై తాము స్పందించాల్సిన పనేలేదు. నిజంగా చంద్రబాబుగారు తప్పుచేసిఉంటే, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిగానీ, కేంద్రప్రభుత్వం గానీ ఊరుకుంటాయా? పెగాసస్ సాఫ్ట్ వేర్ ఆరోపణలపై సుప్రీంకోర్టు వేసిన కమిటీ వాస్తవాలు తేలుస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Andhra Pradesh Mar 19, 2022, 10:22 AM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Mar 18, 2022, 3:52 PM IST
పెగాసెస్ అంశం ఏపీ రాజకీయాల్లో కలకలానికి కారణమైంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో పెగాసెస్ స్పై వేర్ ను కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం మమత చేసిన ప్రకటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది.
Andhra Pradesh Mar 18, 2022, 2:54 PM IST
పెగాసస్ స్పైవేర్ వివాదం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చుట్టుముట్టింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణతో చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు.
Opinion Mar 18, 2022, 8:50 AM IST
Mamata Banerjee: దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన పెగాసస్( Spyware)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మమతా మాట్లాడుతూ, ‘పెగాసస్’ (Spyware)ను తయారు చేసిన ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ 4-5 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులను ఆశ్రయించిందని అన్నారు. వివాదాస్పద పెగాసస్ను స్పైవేర్ను కేవలం రూ. 25 కోట్లకే అందిస్తామని చెప్పారన్నారు. కానీ, దానిని తిరస్కరించామన్నారు. దానిని కొనుగోలు చేయలేదనీ, భద్రతా కారణాల వల్ల దానిని తిరస్కరించినట్టు తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ స్పైవేర్ను కొనుగోలు చేసి, దేశ భద్రత కోసం ఉపయోగించకుండా.. రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారులు, న్యాయమూర్తులపై కన్నేయడం దురదృష్టకరమని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
NATIONAL Mar 18, 2022, 6:04 AM IST
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నాయకులు నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నవ్వుతూనే సుతిమెత్తగా అబద్దాలు ఆడటం జగన్ కు అలవాటైపోయిందని ఆరోపించారు.
Andhra Pradesh Mar 17, 2022, 5:04 PM IST
Pegasus case: పెగాసస్ స్పైవేర్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్యానెల్ (సాంకేతిక కమిటీ) ముందుకు భీమా కోరేగావ్-ఎల్గర్ పరిషత్ కేసులో నిందితులుగా ఉన్న పలువురి మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైస్ లు వెళ్లనున్నాయి. రిజిస్ట్రార్ ఈ పరికరాలను బుధవారం నాడు దర్యాప్తు అధికారికి ఇచ్చే అవకాశం ఉంది. అనంతరం వారు దానిని సుప్రీంకోర్టు కమిటీకి సమర్పిస్తారు.
NATIONAL Feb 8, 2022, 3:25 PM IST
Pegasus spyware: న్యూయార్క్ టైమ్స్ కథనంలో మళ్లీ దేశంలో పెగాసస్ స్పై వేర్ వ్యవహారం రాజకీయ రచ్చ చేస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు పెగాసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. తమకు చెందిన గ్యాడ్జెట్స్ లోకి పెగాసస్ ను పంపించి..నిఘా పెట్టారని పేర్కొంటున్న వారు తమ డివైస్లను అందించాలని సుప్రీంకోర్టు ప్యానెల్ ఇదివరకే పేర్కొంది. అయితే, ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే స్పైవేర్ బారినపడిందని పేర్కొంటూ రెండు ఫోన్లను చూపించారు. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీం ప్యానెల్ తమను సంప్రదించాలని మరో ప్రకటన జారీ చేసింది.
NATIONAL Feb 3, 2022, 3:20 PM IST
Rahul gandhi controversial statement :లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థ నుండి ఎన్నికల సంఘం వరకు ప్రతి సంస్థపై దాడి చేశారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే.. వారి గొంతును అణిచివేసేందుకు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్లను ప్రభుత్వ సాధనాలు మార్చుకుందని అన్నారు.
NATIONAL Feb 2, 2022, 8:58 PM IST
చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సర్వనాశనం చేశారని.. దేశంలో పేదలను కొల్లగొట్టి ధనికులకు పంచుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమీషన్, పెగాసస్ (pegasus) వంటి వాటితో రాష్ట్రాల గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.
NATIONAL Feb 2, 2022, 7:41 PM IST
Pegasus Latest Update: ఐదు రాష్ట్రాల ఎన్నికలతో భారత దేశ రాజకీయం హీటెక్కుతున్న వేళ.. పెగాసస్ వ్యవహారంపై దూమారం రేగుతోంది. ఇజ్రాయెల్ సంస్థ NSO తయారుచేసిన పెగాసస్ స్పైవేర్ ను మోడీ సర్కార్ 2017లోనే కొనుగోలు చేసినట్టు, ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్, భారత్ మధ్య ఒప్పందం జరిగిందంటూ న్యూయార్క్ టైమ్స్ లేటెస్ట్గా మరో కథనం ప్రచురించింది. దీంతో ఇండియన్ పాలిటిక్స్ లో ఈ అంశం హట్ టాఫిక్ గా మారింది. ప్రతిపక్ష నేతలకు విమర్శస్త్రంగా మారింది.
NATIONAL Jan 30, 2022, 5:58 PM IST
పెగాసిస్ అంశంపై సుప్రీంలో మరో పిటీషన్...హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు...
NATIONAL Jan 30, 2022, 3:45 PM IST
Pegasus spyware: మళ్లీ దేశంలో పెగాసస్ స్పై వేర్ వ్యవహారం రాజకీయ రచ్చ చేస్తోంది. ప్రతిపక్షాలు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారును టార్గెట్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. మరోసారి న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనంతో సుప్రీంకోర్టు (Supreme Court) లో మరో పిటిషన్ దాఖలు అయింది.
NATIONAL Jan 30, 2022, 1:05 PM IST
భారతదేశ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున గూఢచర్యం కుంభకోణంపై విపక్షాల దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.మన ప్రజాస్వామ్య ప్రాథమిక సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్ను కొనుగోలు చేసిందని రాహుల్ గాంధీ అన్నారు.
NATIONAL Jan 29, 2022, 11:57 PM IST
Pegasus spyware: గతేడాది దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించి దేశంలోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పౌరులపై ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అక్రమరీతిలో నిఘా పెట్టిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెగాసస్ స్పైవేర్ తో మోడీ సర్కారు "దేశ ద్రోహానికి" పాల్పడిందని ఆయన ఆరోపించారు.
NATIONAL Jan 29, 2022, 2:54 PM IST