దళిత బంధు ఇప్పిస్తానని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఒక్కో యూనిట్ నుంచి రూ. 1 లక్ష డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బాధితులు నిరసన చేశారు. ముత్తిరెడ్డి ఫామ్ హౌజ్ను ముట్టడించారు.
Telangana Feb 2, 2024, 8:53 PM IST
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి తానే బాధ్యుడినని కేటీఆర్ అన్నారు. తాను కార్యకర్తలను పట్టించుకోవడంలో విఫలం అయినట్టు వివరించారు. దళిత బంధు, రైతు బంధు పథకాలతో కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. బీజేపీతో గతంలో పొత్తు లేదని, భవిష్యత్లోనూ ఉండబోదని స్పష్టం చేశారు.
Telangana Jan 12, 2024, 5:05 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత బంధు పథకంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖ దళిత బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. .
Telangana Elections Dec 21, 2023, 12:27 PM IST
దళిత బంధు డౌటేనా? అనే అనుమానాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత బంధు గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. దీంతో ఈ పథకం కోసం ప్రయత్నాలు చేసినవారు.. ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నవారిలో ఆందోళనలు నెలకొన్నాయి. నల్లగొండలో ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్దిదారులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు.
Telangana Dec 19, 2023, 4:29 PM IST
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గజ్వేల్లో దళితులందరికీ ఒకే విడతలో దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్ . నరేంద్ర మోడీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకు ఇవ్వలేదని , మన మీద కుట్రలు చేసే కేంద్రానికి మనం ఎందుకు సహకరించాలని కేసీఆర్ ప్రశ్నించారు.
Telangana Elections Nov 28, 2023, 4:04 PM IST
Telangana Assembly Elections 2023: నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే రేషన్ కార్డుదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యంతో పాటు క్వింటాలు ధాన్యానికి రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తుందని తెలిపారు.
Telangana Nov 22, 2023, 5:38 AM IST
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ రోజు 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్వన్గా వున్నామని.. తాగునీటి సరఫరా, కరెంట్, విద్యుత్లలో అగ్రస్థానంలో వున్నామని సీఎం వెల్లడించారు.
Telangana Nov 2, 2023, 6:00 PM IST
రైతుబంధు, దళితబంధు అనే పదాలు పుట్టించిందే తాను అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు ఎలక్షన్ల కోసం పెట్టిన స్కీమ్ కాదని.. రైతుబంధు పెట్టాలని ఎవ్వరూ తనను అడగలేదని సీఎం పేర్కొన్నారు.
Telangana Nov 2, 2023, 4:10 PM IST
పాలేరు స్థానం సీటును వదిలిపెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధపడటం లేదు. అలాగే, సీపీఎం కచ్చితంగా పోటీ చేయాలనే పట్టుబడుతున్నది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేయాల్సి ఉన్నది. ఈ తరుణంలో కేసీఆర్ ఇక్కడ సంచలన హామీ ప్రకటించారు. హుజురాబాద్లో దళితులందరికీ అందించినట్టుగానే ఇక్కడా బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్ను గెలిపిస్తే దళితులందరికీ దళిత బంధు అందిస్తామని, ఇది ‘నా హామీ’ అంటూ కేసీఆర్ ప్రకటించారు.
Telangana Oct 27, 2023, 6:53 PM IST
ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశారు. దళిత బంధు అమలు కాకుంటే చచ్చిపోతానని గతంలో తాను చెప్పానని, కేసీఆర ముహూర్తం పెడితే తాను గడ్డి మందు తాగి చనిపోతానని అన్నారు.
Telangana Oct 21, 2023, 2:50 PM IST
Dalit Bandhu: దళిత బంధు బీఆర్ఎస్ బంధుగా మారిందని పేర్కొంటూ పలు దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. దళిత బంధులో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణలో నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రజాప్రతినిధుల బంధువులు, కుటుంబ సభ్యులు, సంబంధిత క్యాడర్ ను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. దళిత బంధు కాదు బీఆర్ఎస్ బంధుగా మారిందని ఆరోపిస్తున్నారు.
Telangana Oct 12, 2023, 10:15 AM IST
దళిత బంధు డబ్బులతో కారు కొనుక్కోవడమో, షాప్ పెట్టుకోవడమో, బిజినెస్ చేయడమో చేస్తుంటారు. కానీ ఓ ఫిల్మ్ మేకర్.. ఏకంగా సినిమా తీశాడు. ఇదిప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
Entertainment Oct 9, 2023, 9:14 AM IST
దళితబంధు కోసం ఎవరైన లంచం అడిగితే వారిని బట్టలూడదీయిస్తాయని హెచ్చరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి కడియం శ్రీహరి. ఏ ప్రభుత్వ పథకానికి రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన పనిలేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Telangana Oct 8, 2023, 2:34 PM IST
Koppula Eshwar: కాంగ్రెస్ పార్టీకి ఓట్ల మీద తప్ప దళితుల మీద ప్రేమ లేదని, ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ నాటకమడుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ ను తెలంగాణ లో కాదనీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ డిక్లరేషన్ విడుదల చేయాలని మల్లిఖార్జున్ ఖర్గే కు సవాలు విసిరారు.
Telangana Sep 1, 2023, 8:27 PM IST
చేవేళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభ సందర్భంగా దళిత, గిరిజన డిక్లరేషన్ను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Telangana Aug 26, 2023, 6:56 PM IST