రక్షణ కోసం.. సుప్రీంను ఆశ్రయించిన సానా సతీష్ బాబు
సీబీఐలోని ఇద్దరు అత్యున్నత అధికారుల మధ్య ఆధిపత్య పోరులో కీలకవ్యక్తి సానా సతీశ్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు లంచం ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరవ్వాల్సిందిగా సతీశ్ సానాకు సీబీఐ నోటీసులు పంపింది.
సీబీఐలోని ఇద్దరు అత్యున్నత అధికారుల మధ్య ఆధిపత్య పోరులో కీలకవ్యక్తి సానా సతీశ్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు లంచం ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరవ్వాల్సిందిగా సతీశ్ సానాకు సీబీఐ నోటీసులు పంపింది. అలాగే ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో సీబీఐ విచారణ నుంచి తనను రక్షించాల్సిందిగా సతీష్ బాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు.
ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషి కేసులో తనను విచారణ నుంచి తప్పించాల్సిందిగా హైదరాబాద్కు చెందిన సానా సతీశ్ బాబు.. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 2017 డిసెంబర్ నాటి ఈ వ్యవహారంలో రాకేశ్ ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు
హైదరాబాద్లో సీబీఐ దాడులు.. ప్రముఖుల ఇళ్లలో సోదాలు
రాఫెల్పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్ తోలగింపు: రాహుల్
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?
అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు
అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ
సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు
సీబీఐ చీఫ్గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు
దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్క్వార్టర్స్లో సోదాలు
సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...