స్కూల్ టాయిలెట్లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్.. బంధువు అత్యాచారంతోనే..
Kota: స్కూల్ టాయిలెట్ లో ఓ మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తన బంధువు ఒకరు బాలికపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.
Minor gives birth to baby in school toilet: స్కూల్ టాయిలెట్ లో ఓ మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తన బంధువు ఒకరు బాలికపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో చోటుచేసుకుంది. మైనర్ బాలిక తన అమ్మమ్మను తరచుగా సందర్శించేది. నిందితుడు కూడా ఆ గ్రామంలో నివసించేవాడు. బాలిక కొన్ని రోజులు ఆమెతో ఉండగా, నిందితుడు తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మైనర్ బాలిక పాఠశాల టాయిలెట్ లో బిడ్డను ప్రసవించిన తర్వాత.. నవజాత శిశువును ఒక ఖాళీ స్థలంలో విడిచిపెట్టింది. ఈ ఘటన గురించి తెలిసిన పోలీసులు విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే బాలికను విచారించగా, తనపై జరిగిన అత్యాచార ఘటన గురించి తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. మైనర్ పై దాదాపు 11 నెలల పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. త్వరలోనే నిందితుడిని అదుపులో తీసుకుంటామని చెప్పారు. నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, బాలిక ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తెలిపారు.
ఆదివారం 15 ఏళ్ల బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు పరారీలో ఉన్న 21 ఏళ్ల యువకుడిపై IPC సెక్షన్ 376 (రేప్), POCSO చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్టు బుండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జై యాదవ్ తెలిపారు. బండి సదర్ పోలీస్ స్టేషన్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) అరవింద్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ నిందితులు, మైనర్ బాలిక బంధువులనీ, అతను గత 10-11 నెలలుగా ఆమెపై అత్యాచారం, లైంగిక దోపిడీకి పాల్పడుతున్నాడని చెప్పారు. మైనర్ బాలిక తరచూ తన అమ్మమ్మ వద్దకు వస్తుండగా, నిందితుడు కూడా ఆ గ్రామంలోనే ఉండేవాడు. ఈక్రమంలోనే నిందితుడు అవకాశం దొరికినప్పుడల్లా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమె గర్భవతికి దారితీసింది. బాలిక శనివారం తెల్లవారుజామున బుండి నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలోని బాత్రూమ్లో ఆడ శిశువును ప్రసవించింది. తర్వాత నవజాత శిశువును నిర్జన ప్లాట్లో వదిలివేసింది.
శనివారం తెల్లవారుజామున విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు ఇంటి నుంచి పరారీలో ఉన్నందున నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదనీ, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఐ తెలిపారు.