Asianet News TeluguAsianet News Telugu

మైన‌ర్ పై 8 మంది గ్యాంగ్ రేప్.. ఆపై బెదిరింపులు.. వీడియో వైర‌ల్

Minor gang-raped: ఓ మైనర్ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని వీడియో తీసి, బయటపెడతామని బెదిరించి నిందితులు 16 ఏళ్ల బాలిక నుంచి డబ్బులు వసూలు చేశారు.
 

Rajasthan : Minor gang-raped by 8 men in Alwar, video viral
Author
First Published Sep 30, 2022, 5:24 PM IST

Rajasthan: ఓ మైనర్ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని వీడియో తీసి, బయటపెడతామని బెదిరించి నిందితులు 16 ఏళ్ల బాలిక నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే, అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని లైంగిక‌దాడి వీడియోను షోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైర‌ల్ కావ‌డంతో ఈ షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ దారుణం రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాకు చెందిన ఓ మైనర్‌పై ఎనిమిది మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.50,000 వసూలు చేశారు. నిందితులు 20 ఏళ్లలోపు వారిని స‌మాచారం. 

ఈ దారుణ ఘ‌ట‌న గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిందితులు అల్వార్‌ జిల్లాలోని కిషన్‌గఢ్ బస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికకు చెందిన ప్ర‌యివేటు వీడియోలు, ఫొటోలు పొందారు. రూ. 50,000 చెల్లించకపోతే ఆ ఫోటోలు, దృశ్యాల‌ను సోష‌ల్ మీడియా పోస్టు చేస్తామ‌ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై మైనర్‌ బాలిక సోదరుడు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదుచేసుకునీ, ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. 

గ‌తేడాది (2021) డిసెంబర్ 31న సాహిల్‌గా గుర్తించిన ప్రధాన నిందితుడు సమీపంలోని ప్రదేశానికి తన సోదరికి ఫోన్ చేసి.. మైనర్ బాలిక కొన్ని ప్రైవేట్ ఫోటోలు తన వద్ద ఉన్నాయనీ, ఆమె రాకపోతే, వాటిని సోష‌ల్ మీడియాలో పంచుకుంటామ‌ని బెదిరించారు. ఈ క్ర‌మంలోనే 8వ తరగతి విద్యార్థి వారి చెప్పిన చోటికి వెళ్ల‌గా, ఎనిమిది మంది వ్యక్తులు ఆమెను బలవంతంగా బట్టలు విప్పి, లైంగికంగా వేధించారు. దానిని వీడియో తీశారు. దాన్ని అడ్డుపెట్టుకుని నిందితుడు బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ..  నుంచి డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడు. ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య నిందితులు మైనర్ నుంచి రూ.50 వేలు దోపిడీ చేశారు. అయితే, కానీ అమ్మాయి ఎక్కువ డబ్బు చెల్లించకపోవడంతో, నిందితుడు స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో వీడియోను షేర్ చేశాడు. ఇది వైర‌ల్ గా మారింది. 

"భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376D, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయ‌బడింది. ప్రాథమికంగా, ఆరోపణలు నిజమేనని తెలుస్తోంది" అని కిషన్‌గఢ్ బాస్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అతుల్ ఆగ్రా తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్ల‌డించారు. 

ఇదిలావుండగా, రాజస్థాన్ లో చోటుచేసుకున్న మరో ఘటనలో మైనర్ దళిత బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు కోటాలోని రామ్‌గంజ్ మండి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినది. సెప్టెంబర్ 14న నిందితులు బాలికను కిడ్నాప్ చేసి.. ఆపై అత్యాచారం పాల్పడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios