నన్పై రేప్: సాక్ష్యం చెప్పిన మతాధికారి అనుమానాస్పద మృతి
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషఫ్ ఫ్రాంకో ములక్కల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన జలంధర్ డయోసిస్ మతాధికారి కురియకోస్ కట్టుతార సోమవారం నాడు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం కల్గిస్తోంది.
తిరువనంతపురం: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషఫ్ ఫ్రాంకో ములక్కల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన జలంధర్ డయోసిస్ మతాధికారి కురియకోస్ కట్టుతార సోమవారం నాడు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం కల్గిస్తోంది.
శుక్రవారం రాత్రి తన సోదరుడు మృతి చెందితే ఇవాళ ఉదయం తమకు సమాచారాన్ని ఇచ్చారని మృతుడి సోదరుడు జోస్ కట్టుతార ఆరోపించారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ కు చెందిన ఫాదర్ మైఖేల్ ఈ విషయాన్ని తనకు చెప్పారన్నారు.
రెండు వారాల క్రితమే తనతో కురియకోస్ కట్టుతార మాట్లాడారని జోస్ గుర్తు చేసుకొన్నారు.ఈ కేసుకు సంబంధించి కురియకోస్ సాక్ష్యం చెప్పాడు. ఓ క్రైస్తవ సన్యాసినిపై ఫ్రాంకో ములక్కల్ అత్యాచారం చేసిన కేసులో జైలు నుండి బెయిల్ పై ఇటీవలే విడుదలయ్యాడు.
ఈ కేసులో పోలీసులకు సాక్ష్యం ఇచ్చిన 100 మందిలో కురియకోస్ కట్టుతార ఒకరు. అయితే తనకు బెదిరింపులు వస్తున్నాయని గతంలోనే కురియకోస్ కట్టుతార ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించడాన్ని కుటుంబసభ్యులు గుర్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
నన్పై 13 దఫాలు రేప్: మాజీ బిషప్కు బెయిల్
13 దఫాలు నన్పై రేప్: జైలుకు బిషప్