నన్పై 13 దఫాలు రేప్: మాజీ బిషప్కు బెయిల్
నాలుగేళ్ల క్రితం కేరళకు చెందిన నన్పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన మాజీ బిషప్ ప్రాంకోములక్కల్కు కేరళ హైకోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.
తిరువనంతపురం: నాలుగేళ్ల క్రితం కేరళకు చెందిన నన్పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన మాజీ బిషప్ ప్రాంకోములక్కల్కు కేరళ హైకోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. నన్పై అత్యాచారం చేశారనే ఆరోపణలతో 2018 సెప్టెంబర్ 21వ తేదీన ప్రాంకోములక్కల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ బిషప్ ప్రాంకో ములక్కల్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు పాస్పోర్ట్ను కూడ పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
2014 నుండి 2016 వరకు బిషప్ తనపై 13 దఫాలు అత్యాచారానికి పాల్పడినట్టుగా నన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి మాజీ బిషప్ను అరెస్ట్ చేశారు.
ఈ కేసు విషయమై కేరళలో పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది. మాజీ బిషప్పై చర్యలు తీసుకోవాలనే విషయమై మహిళా సంఘాలు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
13 దఫాలు నన్పై రేప్: జైలుకు బిషప్