13 దఫాలు నన్పై రేప్: జైలుకు బిషప్
కేరళకు చెందిన సన్యాసినిపై 13 దఫాలు అత్యాచారం చేశారనే కేసులో అరెస్టైన బిషప్ ప్రాంకో ములక్కల్ను జ్యూడీషీయల్ రిమాండ్కు తరలిస్తూ పాలా మెజిస్ట్రేట్ ఆదేశించారు
తిరువనంతపురం:కేరళకు చెందిన సన్యాసినిపై 13 దఫాలు అత్యాచారం చేశారనే కేసులో అరెస్టైన బిషప్ ప్రాంకో ములక్కల్ను జ్యూడీషీయల్ రిమాండ్కు తరలిస్తూ పాలా మెజిస్ట్రేట్ ఆదేశించారు. జైలుకు తరలించే ముందు బిషప్ తనకు ఇష్టమైన చేపలకూరతో భోజనం చేశాడని సమాచారం.
బిషప్కు అక్టోబర్ 6వ తేదీవరకు జ్యూడీషీయల్ రిమాండ్ విధించింది కోర్టు. 2014 -16 మధ్య కాలంలో సన్యాసినిపై బిషప్ 13 దఫాలు అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు ఆరుోపిస్తోంది. రిమాండ్ ఖైదీ బిషప్ కు జైలు అధికారులు 5968 నెంబర్ కేటాయించారు.
జైలులోని మూడో నెంబర్ సెల్ ను బిషప్ కు కేటాయించారు. జైలుకు వెళ్లే ముందు బిషప్ చికెన్ కూరతో భోజనం చేశాడని జైలు అధికారులు చెబుతున్నారు.సాధారణ ఖైదీ మాదిరిగానే బిషప్ను ట్రీట్ చేస్తున్నామని జైలు అధికారులు ప్రకటించారు. గదిలోకి వెళ్లగానే బిషప్ ప్రశాంతంగా నిద్రపోయాడని అధికారులు ప్రకటించారు.
ఈ కేసులో బిషప్ను విచారించేందుకుగాను పోలీసులు కస్టడీ పిటిషన్ను దాఖలు చేస్తున్నారు.