జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదవీ కాలం పొడిగింపు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్రం సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ దఫా ధోవల్కు ఆయనకు కేబినెట్ హోదా కల్పించినట్టుగా జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది.
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్రం సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ దఫా ధోవల్కు ఆయనకు కేబినెట్ హోదా కల్పించినట్టుగా జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది.
దేశ భద్రత వ్యవహరాల్లో దోవల్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ హోదా కల్పించినట్టుగా కేంద్రం ప్రకటించింది. రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ బాధ్యతలు చేపట్టిన తర్వాత దోవల్కు కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.
మాజీ దౌత్యవేత్త విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్తో దోవల్కు సమాన హోదా కల్పించారు. 1968 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అజిత్ ధోవల్ సుధీర్ఘ కాలం పాటు ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్గా విధులు నిర్వహించారు..