దారుణం.. మైనర్ ను గ్యాంగ్ రేప్ చేసి.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి..
ఛత్తీస్ ఘడ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ ను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. అయితే దీనిని బయటకు పొక్కనీయకుండా గ్రామస్తులు పంచాయితీ పెట్టారు. బాధిత కుటుంబానికి లక్ష రూపాయిలు ఇవ్వాలని నిందితులను ఆదేశించారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట వారిపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహిళలు కనిపిస్తే మగాళ్లు మృగాళ్లులా రెచ్చిపోతున్నారు. వెంట పడి మరీ లైంగిక దాడి చేస్తున్నారు. తాజాగా చత్తీస్ ఘడ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మైనర్ ను గ్యాంగ్ రేప్ చేసి దానిని బయటకు రాకుండా ప్రయత్నం చేశారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి దానిని కప్పిపుచ్చుకోవాలని అనుకున్నారు.
బీహార్ లో అమానవీయం.. బతికుండగానే మూడేళ్ల బాలికను పాతిపెట్టిన తల్లి, నానమ్మ..
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాలో శనివారం తన తండ్రితో కలిసి బంధువుల ఇంటికి వెళ్తోంది. అయితే ఆమెను ఇద్దరు వ్యక్తులు అపహరించి అడవిలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ ఉన్న మరో ఇద్దరితో కలిసి మైనర్ పై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఆమెను అడవిలోనే వదిలేశారు.
తన కూతురుపై జరిగిన లైంగిక దాడిని తండ్రి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు గ్రామంలో పంచాయితీ పెట్టారు. నిందితులను కూడా అక్కడికి పిలిపించారు. వారిని మందలించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. ఆ కుటుంబానికి రూ.1 లక్ష నష్టపరిహారం అందించాలని చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దని తెలిపారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. కానీ ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై విచారణ జరిపారు. మైనర్ ను పరీక్షల కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జష్పూర్ ఎస్పీ ప్రతిభా పాండే చెప్పారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. భదోహి జిల్లాలోని గోపిగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఉన్న 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ప్రలోభపెట్టాడు. అనంతరం ఆమెను బలవంతంగా ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో 23 ఏళ్ల యువకుడు, మరో వ్యక్తి కలిసి 5 నెలల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల బారి నుంచి తప్పించుకొని వచ్చిన బాలిక.. తల్లిదండ్రులకు ఈ ఘటనను చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం 23 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. మిగితా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.