బీహార్ లో అమానవీయం.. బతికుండగానే మూడేళ్ల బాలికను పాతిపెట్టిన తల్లి, నానమ్మ..
బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన అత్తతో కలిసి సొంత కూతురిని బతికుండగానే పాతిపెట్టింది. అయితే పాప అరుపులు విన్న స్థానికులు చిన్నారిని బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు.
తల్లిదండ్రులు చిన్నారులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. వారిని కంటికి రెపపలా కాపాడుకుంటారు. వాళ్లు ఎదుగుతుంటే ఎంతో సంబరపడతారు. వారి కాలిలో ముళ్లు గుచ్చుకుంటేనే అల్లాడిపోతారు. అల్లరి చేసినప్పుడు ఒక దెబ్బ కొట్టాలన్నా పది సార్లు ఆలోచిస్తారు. పొరపాటున చేయి చేసుకుంటేనే ఎంతో బాధపడిపోతారు. కానీ ఓ తల్లి కర్కషత్వానికి ఒడిగట్టింది. తన అత్తతో కలిసి మూడేళ్ల సొంత కూతుర్నే బతికుండగానే పాతిపెట్టింది.
హృదయాన్ని కంటతడి పెట్టించే ఈ ఘటన బీహార్ లోని సారన్ లో ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. కోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ తన బిడ్డను తీసుకొని శ్మశాన వాటికకు చేరుకుంది. ఆమెతో పాప నానమ్మ కూడా ఉంది. ఆ పాప బతికి ఉండగానే ఓ గొయ్యి తీసి అందులో చిన్నారిని పాతిపెట్టారు. ఈ సమయంలో ఆ పాప ఏడిచింది. దీనిని విన్న స్థానికులు మొదట దయ్యం అని బయపడ్డారు. కానీ నిర్విరామంగా ఏడుపులు వినిపించడంతో వారంతా అక్కడ గుమిగూడారు. వారంతా చర్చించుకొని శ్మశానంలోకి వెళ్లారు.
గర్భ నిరోధకాలను ముస్లింలే ఎక్కువ వాడుతున్నారు: యోగి ఆదిత్యానాథ్పై అసదుద్దీన్ ఫైర్
అక్కడ తాజాగా కనిపిస్తున్న పూడ్చిన గుంతను తవ్వి చూశారు. అందులో బతికున్న పాపను చూసి షాక్ అయ్యారు. ఆ పాపను బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిన్నారిని దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి పేరు లాలీ అని తెలిపింది. తల్లి రేఖా దేవీ అని, తండ్రి రాజు శర్మ అని చెప్పింది. కానీ తన ఊరు పేరు ఏంటో గుర్తించలేకపోయింది. అమ్మ, నానమ్మ తనను బయటకు తీసుకొచ్చారని, అనంతరం గుంత తవ్వి అందులో పాతిపెట్టారని బాధితురాలు పేర్కొంది. చిన్నారి కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు.