Asianet News TeluguAsianet News Telugu

ఎంబీబీఎస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, ఒకరి అరెస్ట్.. చెల్లి పెళ్లికి పిలిచి దారుణం....

రాజస్థాన్ లో స్నేహితుడి చెల్లి పెళ్లికోసం వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఎంబీబీస్ చదువుతున్న ఆ యువతిని పెళ్లికోసం పికప్ చేసుకున్న స్నేహితులిద్దరూ ఆమెను ఫంక్షన్ హాల్ కు తీసుకు వెళ్లకుండా నేరుగా ఓ హోటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ రవీంద్ర గది బయట కాపలాగా ఉండగా రవి యువతిపై హోటల్‌ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

MBBS student gang raped in alwar, rajasthan, one held
Author
Hyderabad, First Published Dec 2, 2021, 12:03 PM IST

అల్వార్ : రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో పోలీసులు బుధవారం ఒకరిని arrest చేశారు. మంగళవారం సాయంత్రం తనపై gang rape జరిగిందని ఆరోపిస్తూ 20 ఏళ్ల MBBS student పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అల్వార్ పోలీసులు బుధవారం 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు రవి చౌదరి అని పోలీసులు గుర్తించారు. రెండో నిందితుడు రవీంద్ర చౌదరి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ కేసులో బాలిక బ్యాచ్‌మేట్ ప్రమేయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అల్వార్‌లో జరుగుతున్న తన చెల్లి marriageకి రావాల్సిందిగా ఆ యువతి బ్యాచ్ మేట్ ఆమెను ఆహ్వానించాడు. ఆ క్రమంలోనే ఈ దారుణం చోటు చేసుకుందని అల్వార్ పోలీసులు పేర్కొన్నారు. అతని ఆహ్వానం మేరకు ఆమె వస్తానని చెప్పింది. ఆమెను పెళ్లికి తీసుకురమ్మని తన స్నేహితులైన రవి, రవీంద్రలను కారులో ఆ బ్యాచ్ మేట్ పంపించాడు. 

ఈ మేరకు యువతిని పికప్ చేసుకున్న స్నేహితులిద్దరూ ఆమెను ఫంక్షన్ హాల్ కు తీసుకు వెళ్లకుండా నేరుగా ఓ హోటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ రవీంద్ర గది బయట కాపలాగా ఉండగా రవి యువతిపై హోటల్‌ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో షాక్ కు గురైన యువతి సహాయం కోసం అర్థించింది. హోటల్ గదినుంచి తప్పించుకుని మంగళవారం సాయంత్రం సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. 

ఇదిలా ఉండగా... గుజరాత్ రాష్ట్రంలోని వడోదర లో నవంబర్ 15న ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. Valsad‌లో రైలు కోచ్ లో వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీస్ నుంచి హాస్టల్ కు తిరిగి వస్తుండగా యువతి వడదరలో సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

ప్రియురాలి స్నేహితురాలికి బీరు తాగించి.. గ్యాంగ్ రేప్ చేసిన బాయ్ ఫ్రెండ్.. అర్థరాత్రి రోడ్డు మీద వదిలేసి...

Vadodaraలోని ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసిన కాలేజీ విద్యార్థిని మృతదేహం నవంబర్ 4న వల్సాద్ లోని గుజరాత్ Queen Express Coachలో వేలాడుతూ కనిపించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతురాలు వడోదర లోని హాస్టల్లో నివసించేది. ఒకరోజు వడోదరలోని ఆటో రిక్షాలో ఇద్దరు నిందితులు యువతిని కిడ్నాప్ చేసి, ఆమె కళ్ళకు గంతలు కట్టి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారని బాధితురాలు తన డైరీలో పేర్కొంది.  ఆ తర్వాత ఆమెపై gang rape జరిగిందా? లేదా?  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి క్రైమ్ అండ్ రైల్వేస్) సుభాష్ విలేకరులకు చెప్పారు.

వడోదర సిటీ పోలీసులు, అహ్మదాబాద్  సిటీ క్రైమ్ బ్రాంచ్,  సైన్స్ లేబొరేటరీ, రైల్వే పోలీసులు సిబ్బందితో దాదాపు 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దాదాపు 450 సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేశామని చెప్పారు.  తాము  కాల్ డేటా  రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ నిఘా,  ఇంటిలిజెన్స్ ఇన్పుట్ లను ఉపయోగించి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios