Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలి స్నేహితురాలికి బీరు తాగించి.. గ్యాంగ్ రేప్ చేసిన బాయ్ ఫ్రెండ్.. అర్థరాత్రి రోడ్డు మీద వదిలేసి...

స్నేహితురాలి మీద బాయ్ ఫ్రెండ్ తో అత్యాచారం చేయించిందో స్నేహితురాలు. బాయ్ ఫ్రెండ్ తో పాటు మరో ముగ్గురు యువకులు కలిసి పాశవికంగా ఆమె మీద దాడి చేస్తుంటే చోధ్యం చూసింది. 

woman allegedly raped by four men with the help of her female friend in rajasthan
Author
Hyderabad, First Published Nov 9, 2021, 11:57 AM IST

స్నేహితురాలి మీద బాయ్ ఫ్రెండ్ తో అత్యాచారం చేయించిందో స్నేహితురాలు. బాయ్ ఫ్రెండ్ తో పాటు మరో ముగ్గురు యువకులు కలిసి పాశవికంగా ఆమె మీద దాడి చేస్తుంటే చోధ్యం చూసింది. 

రాజస్థాన్ : నమ్మి స్నేహితురాలి దగ్గరికి వస్తే నట్టేంట ముంచిది. తన బాయ్ ఫ్రెండ్, అతని స్నేహితులతో కలిసి ఆ యువతి మీద అత్యాచారం చేస్తుంటే.. స్నేహితురాలిని రక్షించాల్సింది పోయి.. వినోదం చూసింది. కళ్లముందే స్నేహితురాలి జీవితం నాశనం అవుతుంటే ఆపలేదు. చివరికి స్నేహితురాలిని అర్థరాత్రి పూట... అపస్మారక స్థితిలో రోడ్డు మీద వదిలేస్తే కూడా పట్టించుకోలేదు.

ఈ దారుణం రాజస్థాన్ లో జరిగింది. ఆ స్నేహితురాలు ఎందుకలా చేయాల్సి వచ్చింది? దేనికి భయపడింది? ఈ gang rape వెనుక వేరే ఇంకేదైనా ఉద్దేశం ఉందా? క్షణికావేశమేనా? అనేది తేలాల్సి ఉంది. ముందుగా వివరాల్లోకి వెడితే...

రాజస్థాన్ లోని దౌసాలో గురుగ్రామ్ (హరియాణా)కు చెందిన ఒక  యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. 23 యేళ్ల ఆ woman తన స్నేహితురాలితో పాటు జైపూర్ లోని చుంగీ ప్రాంతానికి వచ్చింది. 

అక్కడ రెండు రోజుల పాటు ఉంది. తరువాత ఆమె స్నేహితురాలు, ఆమె బాయ్ ఫ్రెండ్ తమతో పాటు ఆ యువతిని దౌసా తీసుకువచ్చారు. అక్కడ ఆమె స్నేహితురాలి boy friendతో పాటు, మరో ఇద్దరు యువకులు ఆమె చేత బీరు తాగించారు.

పరాయి మగాళ్ల వద్దకు వెళ్లాలని భర్త బలవంతం.. తట్టుకోలేక భార్య ఏంచేసిందంటే..!

తరువాత వారి మరో స్నేహితుడు అక్కడికి వచ్చాడు. ఆ నలుగురు యువకులు ఒకరి తరువాత ఒకరుగా ఆమె మీద అత్యాచారం జరిపారు. ఆ తరువాత వారంతా పరారయ్యారు. అర్థరాత్రి పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో యువతి కనిపించింది. 

వెంటనే పోలీసులు.. బాధితురాలిని దౌసా జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు rape case నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. victim స్నేహితురాలిని ప్రశ్నిస్తున్నారు. accussedలను త్వరలోనే పట్టుకుంటామని దౌసా ఎస్పీ అనిల్ బెనీవాల్ తెలిపారు. 

పురుగుల మందు తాగి ఆత్మహత్య...
ఇదిలా ఉండగా.. Karnataka రాష్ట్రంలోని Kolarలో విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కోలారు పట్టణంలోని గల్‌పేట పరిధిలోని కారంజికట్టలో నివాసం ఉంటున్నారు. గత నెల 18వ తేదీన హోన్నెహళ్లి గ్రామానికి చెందిన మహిళ చిన్నారి కిడ్నాప్ నకు గురైంది.  ఈ బాలిక సత్య, సుమిత్ర దంపతుల ఆడ శిశువు. మునియప్ప కుటుంబానికి చెందిన మహిళ ఈ చిన్నారిని తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఈ విషయమై మునియప్ప కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించారు.  పోలీసులు కేసు పెడతారని భయంతో మునియప్ప, ఆయన భార్య నారాయణమ్మ, కొడుకు బాబు, మనమరాలు గంగోత్రి  పురుగుల మందు తాటి ఆత్మహత్యాయత్నం చేశారు. 

పాప కిడ్నాప్ జరిగిందా లేదా పాపను ఆ దంపతులే  ఇచ్చారా అనే విషయమై కూడా స్పష్టత లేదు..ఈ తరుణంలో మునియప్ప కుటుంబాన్ని పోలీసులు విచారణ నిర్వహించారు. అయితే పోలీసులు ఆ కుటుంబాన్ని విచారించారు. అయితే ఈ పాప గురించి సమాచారం తమకు తెలియదని  బాధిత కుటుంబం పోలీసులకు చెప్పారని మృతుల బంధువులు చెబుతున్నారు. 

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ   మరణించారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా నేరం ఒప్పుకోకపోతే పోలీసులు కేసు నమోదు చేస్తారనే భయంతో ఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు తెలిపారు.

అయితే ఈ విషయమై పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేస్తారనే భయంతో ఆదివారం  నాడు మునియప్ప కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఐడుగురు మరణించారని మృతుల బంధువులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios