కొంత మందికే రాజ్యాంగ విధులు, హక్కులపై అవగాహన ఉండటం దురదృష్టకరం - సీజేఐ ఎన్వీ రమణ
రాజ్యాంగ హక్కులు, విధులపై చాలా కొద్ది మందికే అవగాహన ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇది మంచిది కాదని అన్నారు. న్యాయమూర్తులు కూడా ప్రజలకు అర్థం అయ్యేలా సరళమైన భాషలో తీర్పులు రాయాలని ఆయన కోరారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాజ్యాంగ నిబంధనలపై కొద్ది మందికి మాత్రమే తెలియడం దురదృష్టకరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలందరూ రాజ్యాంగం అందించిన హక్కులు, విధులను తెలుసుకోవాలని ఆయన నొక్కిచెప్పారు. ఈస్ట్రన్ బుక్ కంపెనీ నిర్వహించిన ‘సుప్రీం కోర్ట్ కేసులు (SCC) ప్రీ-1969’ అనే పుస్తకం విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Omicron: దేశ రాజధానిలో కొత్త వేరియంట్ కలకలం.. యాంటీ బాడీస్ ఉన్నా..
ప్రజలే న్యాయానికి అంతిమ వినియోగదారుడు అని సీజేఐ అభివర్ణించారు. న్యాయమూర్తుల సరళమైన తీర్పులు రాయడంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల ముఖ్యమైన తీర్పులను లా జర్నల్స్ ద్వారా ప్రాంతీయ భాషలలో ప్రచురించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలలో రాజ్యాంగ హక్కులపై అక్కడి పాఠశాల విద్యార్థులకు కూడా తెలుసునని అన్నారు. ఆ రకమైన సంస్కృతి ఇక్కడ అవసరం అని ఆయన పేర్కొన్నారు. ‘‘ మేము ఇప్పుడు 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నాం. కానీ ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొంతమంది వ్యక్తులు లేదా న్యాయ నిపుణులకు మాత్రమే రాజ్యాంగ హక్కులు, విధులు, రాజ్యాంగ సూత్రాలు తెలియడం దురదృష్టకరం’’ అని CJI రమణ అన్నారు.
‘‘ రాజ్యాంగం ఏమి చెబుతుందో, వారు (చట్టాల ప్రకారం) ఎలా అర్హులో వారు (ప్రజలు) తెలుసుకోవాలి. వారి హక్కులు ఏమిటి ? వారి హక్కులను ఎలా అమలు చేయాలి ? విధులను ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు మనకు అవసరం. ముఖ్యంగా (లా జర్నల్స్ ) సాధారణ భాషలో యాక్సెస్ని ప్రారంభించడానికి ప్రాంతీయ భాషలలో కనీసం ఎంపిక చేసిన ముఖ్యమైన తీర్పులోని ముఖ్యాంశాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది ’’ అని ఆయన అన్నారు.
Rajnath Singh: "ఆయన తెరవెనుక కథానాయకుడు"
తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం ఆర్థిక భారాన్ని పెంచుతుందని సీజేఐ రమణ అంగీకరించారు. ‘‘ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని కోసం కొంత డబ్బును కూడా ఇవ్వగలవని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వారు ఇప్పుడు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పథకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఈ సమస్య గురించి కూడా మనం ఆలోచించవచ్చు’’ అని ఆయన అన్నారు.
22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన తరువాత తీర్పులు కొన్ని సార్లు ‘థీసీస్’ల వంటివి అనే విమర్శలు వచ్చాయని, వాటి గురించి తనకు బాగా తెలుసని అన్నారు. తన సోదర వర్గంలోని సభ్యులందరూ సాదాసీదాగా ఉండాలని అభ్యర్థించినట్లు సీజేఐ రమణ పేర్కొన్నారు. ‘‘ "సంక్షిప్త, ఖచ్చితమైన, చిన్న వాక్యాలలో తీర్పు (రాయడం) సరళంగా ఉండటానికి ప్రయత్నించాలని నేను వాదిస్తూ వస్తున్న నా సోదర సభ్యులతో పాటు న్యాయవాదులను అభ్యర్థిస్తున్నాను. ప్రజలు కథను చదువుతున్నట్లు భావించాలి ’’ అని ఆయన అన్నారు.
Rahul Gandhi: 'సిగ్గుచేటు' హర్ ఘర్ తిరంగాపై రాహుల్ గాంధీ ఫైర్
‘‘ అంతిమంగా రోజు చివరిలో న్యాయ వినియోగదారులు, న్యాయవాదులు, ప్రజలు ఎవరు అయినా సరే వారికి తుది ఫలితం తెలియాలి. అది మన సొంత ఊహలు, తత్వాల కంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ విధంగా మనం ప్రజలకు సహాయం చేయగలమని నేను భావిస్తున్నాను. తార్కికం, ముగింపు స్పష్టంగా ఉండాలి. ఇది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. విశ్వసిస్తున్నాను ” అని CJI రమణ జోడించారు.