ఈ 3 వస్తువులు చాలు.. 3 నెలల్లో ముఖం మీద ఉన్న మొటిమలు మచ్చలు మాయం
మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు కొని వాడే బదులు మన వంటింట్లో ఉండే సహజమైన వస్తువులతోనే ముఖంపై ఉన్న మచ్చల్ని తగ్గించుకోవచ్చు. కొందరికి హైపర్ పిగ్మెంటేషన్ వల్ల మచ్చలు పడతాయి. మరికొందరికి మంగలు మచ్చలు ఉంటాయి.

ముఖంపై మంగు మచ్చలు పోవడం ఎలా?
ఆధునిక జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చేసాయి. దీని వల్ల ఆరోగ్యం, అందం రెండూ ఇబ్బందుల్లో పడుతున్నాయి. కాలుష్యం, ఎండ వల్ల చాలామందిలో 'మంగు' (Melasma) లేదా హైపర్పిగ్మెంటేషన్ సమస్య పెరుగుతోంది. ముఖం అందాన్ని పాడుచేసే ఈ నల్ల మచ్చల కోసం ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే సహజమైన వస్తువులను ఉపయోగించి ఆ మచ్చలను పోగొట్టుకోవచ్చు.
ఎలా పొగొట్టుకోవాలి?
మన వంటగదిలో దొరికే వస్తువులతోనే ముఖాన్ని మెరిపించుకోవచ్చు. శనగపిండి, పసుపు, నిమ్మరసం ఈ మూడింటితో ముఖం మీద ఉన్న మచ్చలను తొలగించుకోవచ్చు. ఈ మూడింటిలోనూ చర్మానికి మేలు చేసే గుణాలున్నాయి. శనగపిండిలో ఉండే జింక్ (Zinc), సాపోనిన్స్ (Saponins) చర్మాన్ని లోతుగా శుభ్రం (Deep Cleansing) చేసి, మృతకణాలను తొలగిస్తాయి. పసుపులోని కర్కుమిన్ (Curcumin) శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది చర్మం మంటను తగ్గించి, మచ్చలను తేలికపరుస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి (Vitamin C) సహజ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి, హైపర్పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది.
ఎలా వాడాలి?
ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు, 4-5 చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్లా చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటూ వదిలేయాలి. ప్యాక్ పూర్తిగా ఆరిపోయి, చర్మం బిగుసుకుపోయే (Cracking stage) ముందే కడిగేయడం మంచిది. ఇలా 1 నుంచి 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే, మచ్చలు తగ్గి ముఖంలో మంచి మార్పు కనిపిస్తుందని ఆమె తెలిపారు. ఏ వంటింటి చిట్కా అయినా వాడే ముందు ప్యాచ్ టెస్ట్ (Patch Test) చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీది సున్నితమైన చర్మం అయితే లేదా సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

